DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకన్న సొమ్ముతో  ఐఏఎస్ ల జల్సాలా:

ఆలయాల్లోని ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే.

ఆలయాలంటే మీ ఏటీఎం కార్డులు కాదు...

రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, నవీన్ కుమార్ రెడ్డి 

(DNS

రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవారి హుండీ తో పాటు, రాష్ట్రం లోని ఇతర ఆలయాల హుండీలకు కన్నం పెడుతూ

ఐఏఎస్ అధికారులు జల్సాలు చేస్తున్నారని 
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్రం లో దేవాదాయ శాఖా పూర్తి గా భ్రష్టు పట్టించారని, వీళ్ళు తమ అధికార దర్పం కోసం ఆలయాల్లోని హుండీలతో జల్సాలు

చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనమే ఢిల్లీ లోని టిటిడి ఆలయం లో సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ అయ్యాయన్నారు. దీన్ని ప్రశ్నించడం తో అక్కడ ఇంచార్జి

రాజీనామా చేశారన్నారు.  à°µà±€à°³à±à°³à± ఆలయాలకు సంరక్షకులు à°—à°¾ మాత్రమే  à°‰à°‚డాలి తప్ప యజమానులుగా తయారవ్వకూడదన్నారు. 

ఆలయాల్లోని ప్రతి రూపాయికి లెక్క

చెప్పాల్సిందే...

హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయం అంటే కేవలం హిందువులు ఆలయాల్లోని హుండీల్లో  à°µà±‡à°¸à±‡ ముడుపులు మాత్రమేనని, వాటిని కేవలం ఆలయాల అభివృద్ధికి,

భక్తుల సౌకర్యాల  à°•à±‹à°¸à°®à±‡ ఖర్చు చెయ్యాలి తప్ప, అధికారులు జల్సాలు చెయ్యడానికి కాదన్నారు.  à°¹à±à°‚డీల్లో  à°µà°šà±à°šà°¿à°¨ ప్రతి రూపాయికే కచ్చితంగా లెక్క

చెప్పాల్సిందేనన్నారు.  

ఆలయాలంటే మీ ఏటీఎం కార్డులు కాదు...

ఎలా పడితే ఆలా వాడుకోడానికి ఆలయాలు అంటే మీ దగ్గర ఉండే ఏటీఎం కార్డులు కాదు అని నవీన్ రెడ్డి

మండిపడ్డారు. అక్రమంగా ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని, తగిన శిక్ష ఉంటుందన్నారు. 
 
రాష్ట్రం లోని పలు ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలను అయన

వివరించారు. వాటిని తక్షణం సరిదిద్దాలని డిమాండ్ చేసారు.  

1) కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా టీటీడీ అధికారులు

విలీనం చేసుకుంటే కోర్టు దిక్కారం కేసును ఎదుర్కోవాలి!!

2) టీటీడీ లోని ఐఎఎస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే దేవాదాయ శాఖను ఏకంగా టీటీడీ లో విలీనం

చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి???

3) టీటీడీ ఈవో, తిరుపతి జేఈఓ,  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯à°¶à°¾à°– కమిషనర్, ఎస్టేట్ ఆఫీసర్, డిప్యూటీ ఈవో కోర్టుకు సమాధానం చెప్పక తప్పదు!!

4)

ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వెంకన్న సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టే హక్కు అధికారం టిటిడి ఐఏఎస్ అధికారులకు ఎవరు ఇచ్చారు??

5) టిటిడి శ్రీవారి నిధులకు

ధర్మకర్తల మండలి సమావేశంలో "చట్ట భద్రత" చేయాలి!!

6) ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీవారి సొమ్మును తరలించే సంప్రదాయానికి "స్వస్తి" పలకాలి!!

7) దేవాదాయ శాఖ

అనుబంధంగా దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం, కాళహస్తి, కనకదుర్గమ్మ లాంటి దేవస్థానాలు ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటే టీటీడీ దేవస్థానం మాత్రం శ్రీవారి

"డిపాజిట్లను" "కార్పస్ ఫండ్" ను కర్పూర హారతిలా కరిగించేస్తున్నారు!!

8) టీటీడీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే టీటీడీ అనుబంధ ఆలయాలు నారాయణవనం, నాగలాపురం,

అప్పలాయగుంట, వకుళామాత ఆలయాలపై దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయండి!!

9) కడప జిల్లా ఒంటిమిట్ట దేవాలయం బ్రహ్మోత్సవాల కోసం టిటిడి ఇప్పటి

వరకు 100 కోట్లు ఖర్చు చేసింది అన్నీ తాత్కాలిక నిర్మాణాలే ఆర్కియాలజీ అనుమతి ఎందుకు టిటిడి ఇప్పటివరకు తీసుకోవడం లేదు??

10 ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల

మెప్పు కోసం తమ కుర్చీలను కాపాడుకునేందుకు టీటీడీ ఐఏఎస్ అధికారులు వెంకన్న సొమ్మును కర్పూరహారతిలా కరిగించడం మహా అపచారం!!

11) దేవాదాయ శాఖకు సంబంధించిన

ఆలయాలను టీటీడీ లో విలీనం చేసుకునే ప్రక్రియకు టీటీడీ స్వస్తి పలుకుతూ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలి!!

12) అధికారాన్ని అడ్డం పెట్టుకొని

శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు అని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam