DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్యాంకులు కాదు  రాజకీయ పార్టీలు విలీనం చెయ్యాలి. 

బ్యాంకులు కాదు  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలు విలీనం చెయ్యాలి. 

దేశం అగ్రగామిగా ఉండాలంటే పార్టీలే అడ్డంకి 

దేశం మొత్తం మీద రెండు లేదా మూడు పార్టీలే ఉంటె. . .

 

ఆర్ధిక స్వావలంబన కాదు రాజకీయ స్వావలంబన అవసరం.

మోడీ పాలనా విధానం లో పెను మార్పులు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, ఆగస్టు  31, 2019

(డిఎన్‌ఎస్‌) : భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు సంచలనం అవుతున్నాయి. అయితే ఫలితాలు

మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనికి ప్రధాన కారణం భిన్న ధృవాలుగా ఉన్న రాజకీయ పార్టీలు. అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే, అది మంచి అయినా సరే

ప్రతిపక్షాలు విభేదించడమే పనిగా పెట్టుకుంటున్నాయి. 

బీజేపీ అధికారం లోకి వచ్చాక . . ఆర్ధిక వెసులుబాటు కోసం జాతీయ బ్యాంకులను విలీనం చేసే పని పెట్టుకుంది.

గతంలో మొదటి విడత కొన్ని విలీనం చేసింది. భారతీయ స్టేట్ బ్యాంకు లో అనుబంధ బ్యాంకులు విలీనం అయ్యాయి. శుక్రవారం చేసిన ప్రకటన ప్రకారం మరో పది బ్యాంకులు విలీనం

అవుతున్నాయి. ఇలా బ్యాంకులు విలీనం చేసినంత మాత్రమే దేశం ముందుకు వెళ్ళదు. .  à°°à°¾à°œà°•à±€à°¯ కీచక పర్వానికి స్వస్తి పలకాలి. దానికి రాజకీయ పార్టీల విలీనం ఒక్కటే

మార్గం. 

రాజకీయ పార్టీలే విలీనం చెయ్యాలి : .. . 

భారత దేశం అగ్రగామిగా నిలవాలంటే ఈ దేశం లోని రాజకీయ పార్టీలన్నింటినీ రెండు మూడు పార్టీల్లో విలీనం

చెయ్యాలి. బ్రిటన్, అమెరికా లాంటి చోట్ల ఉన్నట్టుగా కేవలం అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంటె. ..  à°šà°Ÿà±à°Ÿ సభల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.  

భారత దేశ

రాజ్యంగంలో ఎన్నో అంశాలు ఇతర దేశాల నుంచి కాపీ పేస్ట్ చేసినవే కావడం గమనార్హం. అయితే భారత దేశం లో ఉన్నన్ని రాజకీయ పార్టీలు ఈ భూ ప్రపంచం లో మారె ఏ దేశంలోనూ

లేవంటే అతిశయోక్తి కాదు.గల్లీ నుంచి మొదలై ఢిల్లీ దాకా వీధికో పార్టీ ఉంది. అయితే వీరిలో ఏ ఇద్దరికీ ఒకే ఆలోచనా ధోరణి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పని మొదలు

పెట్టినా దేశ వ్యాప్తంగా అంగీకరించే అవకాశం లేదు. 

రాజకీయ స్వావలంబన అవసరం : . . .

ఎనిమిది దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉండిపోయిన భారత

దేశంలో ముందుగా కావాల్సింది ఆర్ధిక స్వావలంబన కాదు రాజకీయ స్వావలంబన. . . రాజకీయంగా బలపడితేనే తీసుకునే నిర్ణయాలకు బలం చేకూరుతుంది. ఒక్కో రాష్ట్రంలోనూ డజన్ల

కొద్దీ పార్టీలు పుట్టుకొస్తుంటే అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది. అధికారం లో ఉండేది ఏ పార్టీ అయినా సరైన నిర్ణయం తీసుకుంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది.

కేవలం తమ స్వార్ధం కోసం విమర్శలు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది. 

గోడలు దూకేవాడికి ఏ పార్టీ అయితేనేమి :. . .

ప్రస్తుత

పరిస్థితుల్లో పార్టీలు, సిద్ధాంతాలు అనే వాటిని పట్టించుకునే వాడే లేదు. గోడ దూకినట్టు.. రోజుకో పార్టీలోకి దూకుతున్నారు నేతలు. అలాంటప్పుడు ఈ దేశం లో ఇన్ని

పార్టీలు అవసరమా? కేవలం రెండు పార్టీలు ఉంటె . . .వీళ్ళకి నచ్చితే ఉంటారు లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తారు. అంతే.  à°ˆ దేశం అగ్రగామిగా మారాలంటే రాజకీయ స్వావలంబన

మాత్రమే అవసరం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam