DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెర్లోపల్లి - రాపూరు సొరంగ మార్గం భారత రైల్వేకే తలమానికం  

ఓబులవారిపల్లె - కృష్ణపట్నం రైల్వే లైన్లో ఒక అద్భుతం:

దేశం లోనే పొడవైన రైల్వే సొరంగ మార్గం ఆంధ్రాకే సొంతం 

దేశంలోనే ఇంజనీరింగ్ అద్భుతం:ఎం.

వెంకయ్య , 

సాంకేతిక విప్లవాన్ని అభినందించిన ఉప రాష్ట్రపతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) :

ఓబులవారిపల్లె - కృష్ణపట్నం రైల్వే లైన్లో చెర్లోపల్లి - రాపూరు రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించిన 6.7 కిలోమీటర్ల సొరంగ మార్గం ఒక అద్భుతం అని భారత ఉప రాష్ట్రపతి ఎం.

వెంకయ్యనాయుడు ప్రశంసించారు. శనివారం ఓబులవారిపల్లె - కృష్ణపట్నం సొరంగ మార్గం విద్యుదీకరణ రైల్లో వెంకయ్యా నాయుడు దంపతులు ప్రయాణించారు. చెర్లోపల్లి - రాపూరు

రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఈ సొరంగ మార్గం దేశంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణమని, దేశంలో అతి పెద్ద సుదీర్ఘ మార్గం అన్నారు. ఇది తన చిన్ననాటి కలగా అభివర్ణించారు.

భారతీయ రైల్వే లో ఇది ఒక పెద్ద విజయంగా అభివర్ణించారు. 6 .7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రైల్వే మార్గంలో ప్రయాణించడం ఒక అనుభూతి అన్నారు. కృష్ణపట్నం పోర్ట్ కి

అనుసంధానమైన à°ˆ మార్గం ద్వారా భారీ మొత్తం లో రవాణా చేయవచ్చన్నారు.  à°¸à±à°®à°¾à°°à± 437 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన à°ˆ మార్గం లో 44 ట్రాలీ, 14 క్రాస్ ప్యాసేజీలు ఉన్నాయి. మా

చిన్ననాటి స్వస్థలం గ్రామం మీదుగా ఈ రైలు మార్గం వెళ్లడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఇంతటి మహర్దశ వస్తుందని నాడు ఎవ్వరూ ఊహించలేదన్నారు. తానూ కేంద్ర మంత్రిగా

ఉన్న నాడే ఈ మార్గానికి ప్రణాళిక, సర్వే, లైన్లు మంజూరు చేయించడం జరిగిదని, నిర్మాణం పూర్తి అయినా తర్వాత ఉప రాష్ట్రపతి హోదాలో ఈ మార్గం లో ప్రయాణించడం

అదృష్టంగాభావిస్తున్నట్టు తెలిపారు. అటల్ బిహారి వాజపేయి ప్రధానిగాను, నితీష్ కుమార్ రైల్వే మంత్రిగాను ఉండగా ఈ రైల్వే మార్గానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ

నిర్మాణం ప్రయాణించడం వలన కృష్ణపట్నం నుంచి ఓబులవారిపల్లె రావడానికి 112 కిలోమీటర్ల మార్గం తగ్గి, ఐదు గంటల ప్రయాణం తగ్గుతుందన్నారు.అదే విధంగా గుంతకల్ డివిజన్

నుంచి కృష్ణపట్నం రావడానికి 72 కిలోమీటర్ల దూరం కలిసివస్తుందన్నారు.చెన్నై - హౌరా, చెన్నై - ముంబై రైలు మార్గం మధ్య రవాణా, ప్రయాణానికి చాలా సమయం, దూరం

కలిసివస్తుందన్నారు. ఈ మార్గం లో సాధారణ రైళ్లు నడపడం ద్వారా వెంకటాచలం - రాంపూర్ మధ్య ప్రయాణికుల చిరకాల వాంఛ తీరే అవకాశం ఉందన్నారు. ఈ సూచనకు అంగీకరించిన

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు కు అయన ధన్యవాదములు తెలిపారు.  
    
ఉప రాష్ట్రపతి తో పాటు కేంద్ర రైల్వే సహాయ శాఖా మంత్రి సంతోష్ సి. అంగడి,

రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam