DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ భూ వరాహ జయంతి కి టిటిడి ఏర్పాట్లు 

ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహణకు ఏర్పాట్లు. . .

శ్రీవారి కంటే ముందు ఈ స్వామినే దర్శించాలి.

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి,

సెప్టెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1à°¨ వరాహ జయంతి ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ

స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేస్తారు.  à°† à°¤‌రువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు

అభిషేకం నిర్వహిస్తారు.
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది.

స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీ భూవరాహ స్వామి వారిని, ఆ తరువాత శ్రీవారిని

దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా

తెలుస్తోంది. శ్రీ వరాహ స్వామిని ముందుగా దర్శించి, తర్వాతే శ్రీనివాసుని దర్శించాలి అని క్షేత్ర మహత్యం చెప్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam