DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాభివృద్ధి కోసం ఘనంగా గణనాధుని సేవలు 

వాడవాడలా అలరారిన విఘ్ననాశకుడు 

బిక్కవోలు, అయినవిల్లి, ఆలయాల్లో అదరహో . . .

తూగో జిల్లాలో కికిటలాడిన ఆలయాలు 

భారీ కాయం బిక్కవోలు,

అంగుష్ఠమాత్రం అయినవిల్లి. . . .

ఏడాది కో ఇంచి పెరిగే వినాయకుడు బిక్కవోలు గణపతే. . .

చెవిలో చెబితే కోర్కెలు తీర్చే స్వామీ బిక్కవోలు  

ప్రతీకారం

కాదు కార్యాచరణతో జవాబు చెప్పాలి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లమంటూ వాడవాడలా విఘ్ననాశకుణ్ణి ప్రార్హించారు. శ్రీకాకుళం జిల్లా మొదలుకుని నెల్లూరు, వరకూ 13 జిల్లాలోనూ

వాడవాడలా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రాష్ట్రాన్ని ఆర్ధికంగానూ, పారిశ్రామికపరంగాను, అగ్రగామిగాను, అభివృద్ధి పాదంలోనూ సాగాలని

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటూ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్నారు. 

గత పాలకులు ఏమి చేసారు అనే దానికంటే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టవలసిన

అభివృద్ధి పనులపై దృష్టిసారించాల్సిందిగా పాలకులకు సూచనలు చేయడం కూడా గమనార్హం. 

వినాయక ఆలయాల్లో  à°¤à±‚ర్పు గోదావరి జిల్లాలో  à°¸à±à°µà°¯à°‚భూ à°—à°¾ వెలసిన ఆలయాలు

దేశవ్యాప్తంగా ప్రసిద్దికెక్కాయి. అత్యంత ప్రసిద్ధికెక్కినవి బిక్కవోలు, అయినవిల్లి ఆలయాల్లో అత్యద్భుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఆరంభమయ్యాయి.

సోమవారం ఉదయం నుంచి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అత్యంత ప్రసిద్ధికెక్కిన ఆలయాలు కావడంతో ఆలయ దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకా, రాష్ట్రేతర ప్రాంతాల

నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయాల నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేసారు. 

భారీకాయం బిక్కవోలు - ఏడాది కో ఇంచి . . :  :

స్వయం భూ వినాయక విగ్రహ ఆలయాల్లో

అత్యంత ప్రాముఖ్యత కల్గిన బిక్కవోలు లక్ష్మి గణపతి ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని సామర్ల కోట కు 19  à°•à°¿à°²à±‹ మీటర్ల దూరం లో ఉంది. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం

అనపర్తి  à°—్రామ వాసులు  à°­à±‚ స్వాములకు చెందిన వ్యవసాయ క్షేత్రం లో భూమి దున్నుతుండగా బయల్పడ్డా విగ్రహం కావడం గమనార్హం. విగ్రహాన్ని తీసి తమ గ్రామానికి

తరలించేందుకు రెడ్లు చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. స్వామి ఆదేశానుసారం అదే వ్యవసాయ క్షేత్రం లో ఆలయ నిర్మాణం కావించారు.  

నాటి నుంచి ఏడాదికో ఇంచి

చొప్పున ఈ విగ్రహం పెరుగుతూ ఉండడం అత్యంత విశేషం. ఒకనాడు ఒక పెద్ద పంచె స్వామికి కడితే పూర్తి గా సరిపోయేది, ప్రస్తుతం స్వామికి వస్త్రం చిన్నది అవ్వడం విశేషం.

లక్ష్మి గణపతిగా ప్రసిద్ధి కెక్కిన ఈ స్వామిని దర్శించిన వారు నేరుగా స్వామి ఎడమ చెవిలో తమ కోర్కెలు చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ స్వామి అనుగ్రహం పొందినవారు

ఏంతో ఉన్నత పదవుల్లోనూ, దేశ విదేశాల్లో అత్యున్నత హోదాల్లో కొనసాగుతున్నారు. 

  బిక్కవోలు గ్రామం తూర్పు చాళుక్యుల కాలం లో చాలా అభివృద్ధి చెందింది.

గ్రామం లోని హైస్కూల్ ఎదురుగా ఉందనడం తో నిత్యం ఈ ఆలయం విద్యార్థులు, అధ్యాపకులతో కళకళలాడుతుంది. ప్రధానంగా ఆలయ కమిటీ నేతృత్వంలో నిత్యాన్న ప్రసాద వితరణ

జరుగుతుంది.   

తూర్పు గోదావరి జిల్లాలోనే మరో అద్భుతమైన ఆలయం అయినవిల్లి సిద్ది వినాయకుడు.రావులపాలెం నుంచి నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. దక్ష ప్రజాపతి

యజ్ఞం చేసిన సమయంలో ఈ స్వామి ప్రత్యక్షం అయినట్టు తెలుస్తోంది. స్వయంభూ చిన్నది అయినప్పటికీ అత్యంత శక్తి కల్గిన స్వామి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా

రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినది 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam