DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేషన్ కార్డు ఆధారంగా వార్డు వారీగా పరిశీలన చెయ్యాలి

హౌసింగ్ పై అధికారులతో సమీక్ష 

జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2019

(డిఎన్‌ఎస్‌): రేషన్ కార్డు ప్రాతిపదికన వార్డుల వారీగా 
పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ పై జాయింట్ కలెక్టర్ ఎల్.

శివ శంకర్, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆర్డీఓలు, హౌసింగ్ అధికారులతో బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పూర్తిగా నిష్పక్షపాతం ఉండాలన్నారు. డేటా ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని చెప్పారు.  à°‡à°‚à°Ÿà°¿à°‚à°Ÿà°¿ సర్వే à°Žà°‚à°¤ వరకు

వచ్చిందని కలెక్టర్ అడుగుగా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ వాలంటీర్ల ఇంటింట సర్వే పూర్తి అయిందని, ఈ సర్వే 26 నుండి 31 వరకు జరిందన్నారు.

ప్రస్తుతం రెవెన్యూ శాఖ చేస్తున్నట్లు చెప్పారు. జివిఎంసి పరిధిలో మొత్తం 290 వార్డు వాలంటీర్లు ఉండగా 240 మంది మాత్రమే ఉన్నారని, ఖాళీ గా ఉన్న వార్డులను ప్రక్క

వాలంటీర్లకు అప్పగించినట్లు కమీషనర్ డాక్టర్ జి. సృజన చెప్పారు. సర్వే చేసినప్పుడు గృహం ఉన్నదీ లేనిది లబ్ధిదారులకు సంబంధించిన సమాచారం హౌసింగ్ అదికారులను

అడితే తెలుస్తోందని, రేషన్ కార్డు, గృహ స్థలం ఉన్నదీ లేనిది ఆ సమాచారం జాయింట్ కలెక్టర్ ను అడిగితే తెలుస్తోందని కలెక్టర్ వివరించారు. జివిఎంసి పరిధిలో ఎన్ని

వార్డులు ఉన్నాయని యుసిడి అడుగగా 72 వార్డులు ఉన్నాయని యుసిడి పిడి శ్రీనివాసరావు చెప్పారు. జివిఎంసి పరిధిలో త్వరితగతిన సర్వే పూర్తి చేయాలన్నారు. సర్వే 6వ తేదీ

నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, అనకాపల్లి ఆర్డీవో జె. సీతారామారావు, సింహాచలం ఇ.ఓ మరియు ఇన్ చార్జ్

విశాఖపట్నం రెవెన్యూ డిజనల్ అధికారి ఎం వెంకటేశ్వరరావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, హౌసింగ్ పీడీ జయరామాచారి, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam