DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహోన్నతం అక్షయ పాత్ర అన్న ప్రసాద కేంద్రం 

సిక్కోలు లో  à°®à±†à°—à°¾ కిచెన్ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 06, 2019

(డిఎన్‌ఎస్‌): దేశ వ్యాప్తంగా అక్షయ పాత్ర అందిస్తున్న అన్న ప్రసాద వితరణ హోన్నతం అని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రశంసించారు. శ్రీకాకుళం

జిల్లా పర్యటనలో భాగంగా   శ్రీకాకుళం మండలం సింగుపురం సమీపంలో నిర్మించిన అక్షయ పాత్ర సంస్ధ హై టెక్ కేంద్రీయ వంట శాలను ఆయన ప్రారంభించారు. జిల్లా పర్యటనకు

శుక్ర వారం వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి పలాస, ట్రిపుల్ ఐటి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్షయ పాత్ర హై టెక్ కేంద్రీయ వంట శాలను ప్రారంభించారు. అరబిందో

ఫార్మా లిమిటెడ్ సౌజన్యంతో రూ.9 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ కేంద్రీయ వంటశాల నుండి 25 వేల మంది విద్యార్ధులకు ఆహారాన్ని అందించవచ్చును. కేంద్రీయ వంటశాలను

ముఖ్య మంత్రి పరిశీలించి ఆహార పదార్ధాలు తయారయ్యే విధానాన్ని పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ

అధ్యక్షులు మరియు ఆహార పదార్ధాల ప్రత్యేక ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస వివరించారు. ఆహార తయారీ విధానం నుండి ఆహార వంట పాత్రలను శుభ్ర పరిచే విధానం వరకు గల

ప్రక్రియను వివరించారు. అనంతరం వంట సరుకుల నిల్వ జరిగే ప్రక్రియను తెలిపారు. చిన్నారులకు ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఆహారం లేని

కారాణంగా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో పౌండేషన్ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆహార పదార్ధాల తయారీలో ఆధునాతన సాంకేతికతో కూడిన పాత్రలను వినియోగించడం

జరుగుతోందని చెప్పారు. దేశంలో 12 రాష్ట్రాల్లో 15,668 పాఠశాలల్లోగల 1.76 మిలియన్ చిన్నారులకు ఆహారాన్ని అందిస్తున్నామని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో 612 పాఠశాలలు, 9,500

అంగన్వాడీ కేంద్రాలలోగల 1.51 లక్షల చిన్నారులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని వివరించారు. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
         

విద్యార్ధులకు చక్కని పౌష్టిక ఆహారాన్ని అందించాలని తద్వారా వారిలో  à°šà±à°°à±à°•à±à°¦à°¨à°‚ పెరగాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మంచి కార్యక్రమమని

అభినందించారు. చిన్నారుల విద్యకు పౌష్టికాహారం అతి ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చిన్నారులు ఉన్నత శిఖరాలకు చేరాలని

ముఖ్య మంత్రి ఆకాంక్షించారు.

          à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర రహదారులు

భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, గొర్లె కిరణ్ కుమార్, శాసన సభ్యుడు  à°¡à°¾. సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్, ముఖ్య

మంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, రెవిన్యూడివిజనల్ అధికారి ఎం.వి.రమణ, బి.సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్

జి.రాజారావు, పూర్వ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam