DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్య పరిశ్రమ అభివృద్థికి అండగా కేంద్రం 

మత్స్యకారుల అభివృద్థికి రూ.25 వేల కోట్లు

కేంద్ర మత్స్య,పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం

). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): మత్స్య పరిశ్రమ అభివృద్థికి à°…à°‚à°¡à°—à°¾ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందని కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖా మంత్రి గిరిరాజ్

సింగ్ వెల్లడించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ నోవోటెల్ హోటల్ లో బోటు యజమానులు, హేచరీ ఓనర్లు, రొయ్య చెరువులు చేస్తున్న యజమానులు, సెంట్రల్ ఫిషరీస్ ఇనిస్టిట్యూషన్స్

అధికారులతో (మత్స్య కేంద్ర ప్రభుత్వ సంస్థలు) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  à°¦à±‡à°¶à°‚లో ఉన్న మత్స్యకారుల అభివృద్థికి

కేంద్ర ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. దేశంలో వ్యవసాయ శాఖ కు మంత్రిత్వ శాఖ ఎలా ఉన్నదో అదే విధంగా మత్స్య శాఖకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు

చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదేశాలపై దేశంలో ఉన్న మత్స్యకార గ్రామాలు, వారి స్థితి గతులను తెలుసుకొనేందుకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లో

పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించడం జరుగుతుందని వివరించారు. సముద్రంలో మత్స్య సంపద ఉన్నదని, దానిని అభివృద్థి చేసుకోవాలన్నారు.  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం

సబ్సిడీ పై డీజిల్, తదితరమైనవి ఇస్తుందని చెప్పారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్థికి నిధులు అడిగినట్లు తెలిపారు. శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాదవ్

మాట్లాడుతూ పూడిమడక, భీమిలి, మంగమారిపేటలలో తక్షణమే జట్టీలు నిర్మించాలని మంత్రిని కోరారు.  à°®à°¤à±à°¸à±à°¯à°•à°¾à°°à±à°² అభివృద్థికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.  à°®à°¤à±à°¸à±à°¯à°•à°¾à°°

సంఘాల ప్రతినిధులు పి.సి. అప్పారావు మాట్లాడుతూ మత్స్యకార సమస్యలను మంత్రికి వివరించారు.  à°¨à±€à°²à°•à°‚à° à°‚ మాట్లాడుతూ పాకిస్తాన్ జైల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా

మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులను ఎస్.టి.లుగా గుర్తించాలని కోరారు. దాసు మాట్లాడుతూ ఫిషింగ్ హ్థర్బర్ లో పారిశుద్ద్యం

బాగోలేదని, పోలరాజు మాట్లాడుతూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, ట్యూనా చేపలకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు.     à°ˆ సమావేశంలో మత్య్సశాఖ కమీషనర్

రాంశంకర్ నాయక్, మత్య్స శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పలువురు మత్స్యకారులు వినతులను మంత్రికి అందజేశారు. 
     à°…నంతరం ఫిషింగ్ హార్బర్ ను మంత్రి

సందర్శించారు.  à°¹à°¾à°°à±à°¬à°°à± కు ఎన్ని టన్నులు చేపలు వస్తున్నాయి, ఎన్ని టన్నులు ఎగుమతి చేస్తున్నారు, ఎన్ని టన్నుల చేపలను ఎండబెడుతున్నారు, తదితర అంశాలపై మత్స్యకార

సంఘాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam