DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా వ్యాప్తంగా త్వరలో ఇంటింటికి కొళాయి

రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం

జిల్లాలోని ప్రతీ పట్టణం, గ్రామంలో ఉండే ప్రతీ ఇంటికీ త్వరలో కొళాయిలు రాబోతున్నాయని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు.   ఆదివారం ఉదయం

సరుబుజ్జిలి మండలం రొట్టవలస పంచాయతీ పరిధిలోని అవతరాబాద్  à°—్రామంలో రూ.9.00 లక్షల à°¡à°¿.ఎఫ్.à°Žà°‚ గ్రాంటు నిధులతో నిర్మించిన డైరక్ట్ పంపింగ్ మంచినీటి సరఫరా పథకం

ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం  à°¤à°¾à°—ునీటి  à°•à±Šà°³à°¾à°¯à°¿à°¨à°¿ ప్రారంభించి మహిళలకు అందించారు. à°ˆ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు త్వరలో  à°°à±‚.14

వేల కోట్ల నిధులతో వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటుకాబోతున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉండే నదులు, చెరువులు, బోర్లు ద్వారా  à°®à°¹à°¿à°³à°²à°•à± నీటిని అందించే

కార్యక్రమానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తద్వారా  à°ªà°Ÿà±à°Ÿà°£à°¾à°²à°¤à±‹ పాటు గ్రామాల్లోని ఇంటింటికీ తాగునీటి సరఫరా కాబోతుందని, అతి త్వరలో యుధ్ధ ప్రాతిపదికన

ఇంటింటికీ కొళాయి పనులు ప్రారంభమవు తాయని పేర్కొన్నారు. చిన్న కుర్రాడు అయిన ముఖ్యమంత్రి ధృవతారల దూసుకుపోతున్నాడని, చెప్పిన మాటకు కట్టుబడి పనులు

చేస్తున్నారని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో నీళ్లకోసం ఆరాటపడిన మహిళలను చూసిన ఆయన తాగునీటి సరఫరాపై దృష్టి సారించారన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగ విప్లవం

తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నాలుగు మాసాల్లోనే సుమారు 5.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్న సంగతిని గుర్తుచేసారు. అంతేకాకుండా  à°°à±ˆà°¤à±à°²à°•à±

గిట్టుబాటు ధరలు ఇస్తున్నారని, విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతిని వివరించారు. ఇటువంటి

కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రిని అభినందించాలే తప్ప విమర్శలు  à°šà±‡à°¯à°°à°¾à°¦à°¨à°¿ హితవు పలికారు. ప్రతిపక్షం మరింత హుందాతనంగా నడుచుకోవాలని సూచించారు. తాగునీటి

కొళాయిలను ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా నాణ్యమైన బియ్యం పంపిణీలో

తడిసిన బియ్యం, పట్లు పట్టిన బియ్యాన్ని కార్డుదారులకు సరఫరా చేస్తున్నారని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వర్షాల కారణంగా బియ్యం తడిసిన మాట

వాస్తవమేనని, అటువంటి వాటిని మార్చి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మరియు ఇ.ఓ పి.ఆర్.డి

పొన్నాడ మురళీమోహన్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు బి.రవి , ఇతర అదికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam