DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ.13 లక్షలతో స్పందన భవనం ప్రారంభం: కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్: SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, స్టాఫ్ రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఎంతో

ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందులో భాగంగా ఫిర్యాదుల విభాగాన్ని నవీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ

ప్రాంగణంలో రూ.13 లక్షలతో నవీకరించిన స్పందన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. స్పందనలో అర్జీ సమర్పించేందుకు వచ్చిన శ్రీకాకుళం మండలం

తంగివానిపేట గ్రామానికి చెందిన సాధు పోలమ్మతో జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పందన భవనాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర

ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టడం

జరిగిందని, అదేవిధంగా సమస్యలను తీసుకువచ్చే  à°ªà±à°°à°œà°²à°•à± మౌళిక వసతులు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అందులో భాగంగా నేడు  à°ˆ భవనాన్ని

ఆధునీకరించడం జరిగిందని స్పష్టం చేసారు. స్పందన కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటివరకు 18,027 ఆర్జీలు వచ్చాయని, వాటిలో 16,372 ఆర్జీలను  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚à°šà°¡à°‚ జరిగిందని

తెలిపారు. 400 ఆర్జీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిశీలించి త్వరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.
       à°…నంతరం

ఇంటింటికీ రేషన్ పంపిణీ గురించి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి పైలెట్ ప్రోజెక్టుగా ప్రారంభమైన నాణ్యమైన బియ్యం పంపిణీ జిల్లాలో దాదాపు 90 శాతానికి పైగా

పూర్తయిందని చెప్పారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాలకు సైతం నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ సరఫరా చేయడం జరిగిందని, మిగిలిన వారికి కూడా నాణ్యమైన బియ్యం పంపిణీ

అవుతుందని తెలిపారు. బియ్యం తీసుకున్న కార్డుదారులు బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసారని, అలాగే వండిన బియ్యంపై కూడా కార్డుదారులు తమ సంతృప్తిని వ్యక్తం

చేసారని కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చే మాసంలో మరింత త్వరగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేసారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో

సంయుక్త కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జె.చక్రధరరావు,

జిల్లా పంచాయతీ అధికారి బి.రవికుమార్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖాధికారి , సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు

కె.వి.ఆదిత్యలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, మత్స్య శాఖ ఉపసంచాలకులు డా. వి.వి.కృష్ణమూర్తి, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు

సిహెచ్.మహాలక్ష్మీ, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, జిల్లా అటవీశాఖాధికారి బి.ధనుంజయరావు,  à°¸à±†à°Ÿà± శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి

వి.వి.ఆర్. యస్. మూర్తి, ప్రజారోగ్య విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకర రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ ఆర్.గున్నయ్య, ఇతర జిల్లా అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam