DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కి అన్యాయం చేసిన అతనికి AU డాక్టరేటా ? VC ఏకపక్ష నిర్ణయం పై మండిపాటు

ఏ యూ ప్రతిష్టను బ్రష్టు పట్టిస్తున్న అధికారులు 
ఒక్కడి కోసం స్నాతకోత్సవం వాయిదా నా ? 
పరువు కంటే పార్టీ ముఖ్యమా ? 

విశాఖపట్నం. మే 29, 2018 (DNS Online) :  à°¤à±Šà°‚భై

సంవత్సరాల ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రతిష్టను గంగపాలు చేస్తున్న ఎయు ఉన్నతాధికారులపై విద్యార్థులు, మేధావులు మండిపోతున్నారు. ఒక్కరి కోసం ఏకంగా

స్నాతకోత్సవాన్నే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం తో విస్తుపోవడం విద్యార్థుల వంతయ్యింది. ఈ నెల 31 న స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఎయు పాలక మండలి

తీర్మానించింది. ఎయు వీసీ డాక్టర్ జి. నాగేశ్వర రావు, పాలక మండలి పై ఒత్తిడి తెఛ్చి రాజీవ్ కుమార్ పేరు ను ఆమోదింప చేశారనే అభియోగాలు

వ్యక్తమవుతున్నాయి. 

స్నాతకోత్సవం : ఏ యు లో జరిగే మహత్తర ఉత్సవం స్నాతకోత్సవం. à°ˆ ఉత్సవం లో పీహెచ్ à°¡à±€ పట్టాలు పొందేందుకు, ఎంఫిల్ పట్టాలు, పీజీ లో బంగారు 
/> పతకాలు పొందేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తగినంత రుసుము చెల్లించి పేర్లు నందు చేయించుకున్నారు. జీవితం లో లభించే ఏకైక, అరుదైన అవకాశం నేరుగా

స్నాతకోత్సవ వేదిక పై తమ పట్టాలు పొందేందుకు దేశ విదేశాల నుంచి కూడా వచ్చెందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కేవలం రెండు రోజుల ముందు ఈ వేడుకను రద్దు

చేస్తున్నట్టు ఏ యు అధికారులు ప్రకటించడం తో అభ్యర్థులు మండిపడుతున్నారు. 

వాయిదా కు కారణం : స్నాతకోత్సవం వాయిదా వేయడానికి ప్రధాన కారణం, . . .ఈ వేడుకల్లో గౌరవ

డాక్టరేట్ అందుకోడానికి ఎంపిక కాబడిన వ్యక్తి పేరు వివాదాస్పదం కావడమే. ఈ ఏడాది ఎంపిక చేసిన పేరు డాక్టర్ రాజీవ్ కుమార్. ఈయన ప్రస్తుతం నీతిఆయోగ్

ఉపాధ్యక్షునిగా హోదా లో ఉన్నారు. అడ్డగోలుగా విభజించబడిన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆరు కోట్ల ఆంధ్రులు నిరసనలు తెలియచేస్తుంటే. . . ఈ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని తెలిచిన సంఘం ఇదే. దీంతో ఎయు అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం గా మారింది. విద్యార్థి సంఘాలు, రాజకీయ

వర్గాలు ఎయు అధికారుల పై మండి పడుతున్నారు. 

దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ స్నాతకోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎయు రిజిస్ట్రార్ డాక్టర్ ఉమా

మహేశ్వర రావు ప్రకటించారు. 

కొసమెరుపు :  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఎయు వీసీ à°—à°¾ ఉన్నడాక్టర్ జి. నాగేశ్వర రావు, బీజేపీ అనుబంధం సంస్థ ఆర్ ఎస్ ఎస్, సంఘ్ కూటముల అభిమాని కావడం తో,

జాతీయ స్థాయి నేతలు, ఈయనపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీవ్ కుమార్ కు ఎయు నుంచి గౌరవ పట్టా ఇప్పించి ఏర్పాటు చేసినట్టు సమాచారం. 


 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam