DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాలుగేళ్ల లో బాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకున్నారు  : జనసేనాని పవన్ కల్యాణ్

• మీరు రాష్ట్ర ఖజానాకి ధర్మకర్త మాత్రమే... అదేమీ హెరిటేజ్ డబ్బు కాదు
• మీ మాజీ ఉద్యోగికి వందల కోట్లు ఎలా ఇచ్చేస్తారు?
• ఇసుక మాఫియాతో భూమాత రోదిస్తోంది 


అణు విద్యుత్ కేంద్రంతో ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారు

రణస్థలం, మే 28 2018 ( DNS Online ) : విభక్త రాష్ట్రాన్ని ఆదుకుంటారని ఆరు కోట్ల ఆంధ్రులు ఓటేసి

గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అండ్ కో నాలుగేళ్ళు గా దోచుకుంటున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన లో

భాగంగా సోమవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపం దాల్చారు. 

ఉత్తరాంధ్రలో ప్రజల ప్రాణాలు పణంగాపెట్టి అణు

విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి అనుమతులు ఇచ్చి à°ˆ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. “సీఎం గారూ... ఒకటే చెబుతున్నా à°ˆ రాష్ట్రంలో

ప్రజలెవరూ అభివృద్ధి చెందలేదు.. ఉద్యోగులకి భద్రత లేదు... రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు. బాగుపడ్డది మీరు, మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు మాత్రమే బాగుపడ్డారు” అని

స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ఖజానాకి ధర్మకర్త మాత్రమే... అదేమీ ఆయన హెరిటేజ్ డబ్బు కాదన్నారు. ప్రజలు పన్నులు కట్టిన ఆ సొమ్ముని మీ ఇష్టానుసారం

వెదజల్లడానికి అదేమీ మీ హెరిటేజ్ కంపెనీ డబ్బు కాదు అన్నారు. ప్రజలందరి సంక్షేమం కోసం సమానంగా ఖర్చు చేయమంటే... మీ హెరిటేజ్ మాజీ ఉద్యోగికి ఫైబర్ నెట్ పేరుతో

వందల కోట్లు ఇస్తారా అని నిలదీశారు. 
"కొవ్వాడ దగ్గర అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కొవ్వాడ అణు విద్యుత్కేంద్రానికి

భూములు సేకరణ అని తెలియగానే ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అనిపించింది. అందరూ వద్దంటే.. మన ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడకు తెస్తున్నారు. నేను అమెరికా వెళ్లినప్పుడు

అక్కడ అణు విద్యుత్ కేంద్రం సందర్శించాను. ప్రపంచమంతా ఈ తరహా విద్యుత్ కేంద్రాలు వద్దు అనే చెబుతోంది. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం మన ప్రాణాలు

పణంగా పెట్టింది. ఉపద్రవం సంభవిస్తే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలూ తుడిచిపెట్టుకుపోతాయి.
40 ఏళ్ల అనుభవం సిఎం ప్రత్యేక హోదా విషయంలో 36 సార్లు మాట మార్చారు. అదేం

అభివృద్ధికి మంత్రదండం కాదు అన్నారు. జనసేన 2016లోనే హోదా కావాలి అని బలంగా మాట్లాడితే ముఖ్యమంత్రి మాత్రం అదేం సంజీవని కాదు అన్నారు. ఇప్పుడేమో శ్రీకాకుళం

అభివృద్ధి కావాలంటే హోదా కావాలి అని ఆయనే అంటున్నారు. పాలకులు ఇలా ఇష్టానుసారం మాటలు మార్చడంపై మన నిరసన కవాతుల్లో ప్రజల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

టిడిపి, బిజెపి నాయకుల్ని బలంగా నిలదీయండి. రణస్థలం అంటే పోరాటాలకి స్ఫూర్తి. ఈ స్ఫూర్తితో ప్రత్యేక హోదా పోరుని ముందుకు తీసుకువెళ్లి కేంద్రం మెడలు

వంచుదామన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam