DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతంపేట ఐటిడిఏ లో గిరిజనులకు ప్రోత్సాహకాలు  

రూ.160 లక్షలతో ఆశ్రమ పాఠశాల అదనపు భవనం 

9 కోట్ల నిధులను మహిళా సంఘాలకు పంపిణీ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): సీతంపేట ఐ.à°Ÿà°¿.à°¡à°¿.ఏ ప్రాంగణంలో గిరిజన సామజిక వర్గాల ప్రజలకు పలు ప్రోత్సాహకాలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

అందించారు. బుధవారం ఈ ప్రాంగణాన్ని సందర్శించిన ఆమె రూ.160 లక్షల నాబార్డు నిధులతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అదే

విధంగా 
రూ.3224.03 లక్షల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో చేపడుతున్న గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతంలో రహదారులు,పాఠశాలలకు ప్రహరీ గోడలు,సి.సి.కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన

 à°®à°°à°¿à°¯à± రూ.80 లక్షల నిధులతో డివిజినల్ మేనేజరు కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్సు సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 
అనంతరం  à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°²à°•à± సంక్షేమ

పధకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి
పంపిణీ చేసారు. కొందరు యువకులకు లాప్ టాప్ లు, ఎనిమిది ఆటోలు పంపిణీ, 188 మంది గిరిజనులకు త్రికార్ పధకం క్రింద 2

కోట్ల 56 లక్షల 60 వేల రూపాయలు చెక్కులను అందించారు. సీతంపేటకు చెందిన గిరిజన మహిళా సమాఖ్య (267 సంఘాలు) బృందానికి 7 కోట్ల 69 లక్షల  75 వేల రూపాయలు చెక్ ను అందించారు. అంతకు

ముందు సీతంపేట ఐటిడిఎ ప్రాంగణం లో ఉన్న ఆదివాసీ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అభివాదం తెలియచేసారు. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెంట

జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.à°Žà°‚.సాయికాంత్ వర్మ,  à°ªà°²à°¾à°¸ ఎమ్మెల్యే డాక్టర్ సీడిరి అప్పల రాజు,

పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam