DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కమిషన్‌ల కక్కుర్తి తో జనరిక్ కు జబ్బు వచ్చింది  

రోగులకు జనరిక్‌ మందులు రాయని డాక్టర్లు

ఫారెన్‌ ట్రిప్పులతో వైద్యులను ట్రాప్ చేస్తున్న కంపెనీలు

ఎంసీఐ నిబంధనలన్నా లెక్క లేదు

(DNS రిపోర్ట్ :

పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .. 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : వైద్యో నారాయనో హరిః.. అన్న నమ్మకం పోయి వైద్యుల వద్దకు వెళ్తే ప్రాణాలు హరీ మనక

తప్పదనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు వైద్యులు. ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే కమిషన్‌లకు కక్కుర్తిపడి పనికిరాని కంపెనీలకు చెందిన మందులను రోగులకు

అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో సైతం పనికిరాని మందులను తమ సొంత మెడికల్‌ షాపుల్లో ఉంచి వాటినే

ప్రిస్కిప్షన్‌లో రాస్తుండటంతో చేసేదిలేక ప్రజలు వీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 à°µà±€à°³à±à°²à±à°°à°¾à°¸à±‡ కంపెనీల మందులు బయట ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త

పడుతుండటంతో రోగులు అధిక ధరలకు వారి వద్దే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మంచి కంపెనీల మందుల కంటే నాసిరకం మందుల కంపెనీలు వైద్యులకు అధిక కమీషన్లు

ఎరగా చూపి తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు.

రోగుల ప్రయోజనాలను పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చివరకు ల్యాబ్‌లు,

స్కానింగ్‌ సెంటర్‌à°² వద్ద కూడా కమీషన్లకు అలవాటు పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు వైద్యులు కనీస సౌకర్యాలు కూడా లేని ల్యాబ్‌లు,

స్కానింగ్‌ సెంటర్‌లకు రోగులను పంపుతుండటంతో వ్యాధి నిర్ధారణ కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఏదో à°’à°•à°Ÿà°¿ రాసి వీరు పంపడం అది చూసి

తూతూమంత్రంగా మందులు రాసివ్వడం కొందరు వైద్యులకు నిత్యకృత్యంగా మారింది. అసలు వ్యాధి నిర్ధారించలేక పోవడంతో జబ్బు తగ్గక రోగులు ఆసుపత్రుల చుట్టూ ఏళ్ల తరబడి

తిరగాల్సి వస్తోంది. దీనికితోడు వైద్యులకు కమీషన్‌లు ఇవ్వాలనే కారణంతో ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు à°† భారాన్ని కూడా రోగులపై మోపుతుండటంతో

ఆసుపత్రులకు వెళ్లాలంటే హడలిపోతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam