DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపట్నంలో సింధు అకాడెమీ కి  5 ఎకరాలు స్థలం  

పివి సింధును అభినందించిన ముఖ్యమంత్రి 

బ్మాడ్మింటన్‌ అకాడమీకి భూమి కేటాయించాలని కోరిన సింధు

సీఎంను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పివి

సింధు

అకాడమికి భూమి కేటాయిస్తామనడం పట్ల హర్షం.

అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇచ్చారు: సింధు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ బ్మాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌ ను కలిసారు.

క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పివి సింధు తల్లిదండ్రులు పివి రమణ, లక్ష్మి, క్రీడాసంఘాల ప్రతినిధి ఛాముండేశ్వరీనాద్, అధికార భాషాసంఘం

అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాప్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌ ను కలిసారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన బంగారు

పతకంను ముఖ్యమంత్రికి చూపించారు. à°ˆ సందర్బంగా వైఎస్‌ జగన్‌ ఆమెను అభినందించారు. పివి సింధును శాలువతో సత్కరించారు. అనంతరం సెక్రటేరియట్‌ లో మంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌ పివి సింధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌

జగన్మోహన్‌ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందని అన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ à°…à°‚à°¡à°—à°¾ వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో 5 ఎకరాల

భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌

చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు. 
గోల్డ్‌ మెడల్‌ సాధించిన∙తరువాత మొట్టమొదటి సారిగామన

రాష్ట్రానికి వచ్చిన బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ

ఆమె ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à±‌ జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారని, పివి సింధు సాధించిన విజయం పట్ల సీఎం చాలా సంతోషం వ్యక్తంచేశారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఆమె

మరిన్ని విజయాలు సాధించాలని సిఎం మనస్పూర్తిగా ఆకాంక్షించారన్నారు. రాబోయో ఒలంపిక్స్‌ లో పివి సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సిఎంగారు కోరుకున్నారని

అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు à°’à°• బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను

కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం అండగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ

ఇచ్చినట్లు తెలిపారు. మన తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam