DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు మంచి సేవలు అందించండి: ఎమ్మెల్యే ధర్మాన 

నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనుల సమీక్ష  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రజలకు

మంచి సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయి జిల్లా నీటి యాజమాన్య సంస్థ,

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పనులు, కార్యక్రమాలపై శని వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ధర్మాన ప్రసాద రావు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతీ కార్యక్రమంను నిజాయితీగా చేపట్టాలని భావిస్తోందని దానిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. ప్రతి కార్యక్రమం, సేవ ప్రజలకు ఎటువంటి

గ్యాప్ లేకుండా సకాలంలో అందాలని ఆయన పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ సహాయం అందేటప్పుడు సంబంధిత బృందాల నుండి నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం

అందుతుందని ఆయన అన్నారు. అటువంటి పద్ధతులు మానుకోవాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే తపన ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.

పని చేస్తున్న ఉద్యోగంకు సంబంధించి ప్రతీ సిబ్బంది పూర్తి సమాచారం కలిగి ఉండాలని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో మంచి ప్రగతి కనిపించాలని శాసన

సభ్యులు అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందాలని వాటి పట్ల ప్రజల్లో సంతృప్తి కానరావాలని ఆయన కోరారు. ప్రగతిని పరిశీలించుటకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని,

 à°ªà±à°°à°œà°² నుండి సిబ్బంది గూర్చి మంచి స్పందన రావాలని ఆయన అన్నారు. ప్రజల నుండి మంచి గౌరవం పొందే విధంగా సేవలు ఉండాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో మంచి పనులు

చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో మంచి పనులు చేపట్టుటకు మంచి అవకాశమని అన్నారు. దానిని చక్కగా వినియోగించుకుని శాశ్వత పనులను చేసుకోవలసిన

అవసరం ఉందని ఆయన స్పష్టం చేసారు. ఉపాధి హామీ వేతనాలు చెల్లింపులో సమగ్ర పరిశీలన అవసరమని అన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పెద్ద పనుల వివరాలు సమర్పించాలని

వాటిపై అవసరం మేరకు సంబంధించిన మంత్రులతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.
 à°¡à°¿à°†à°°à±à°¡à±€à° పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు శ్రీకాకుళం

నియోజకవర్గంలో 929 మహిళా సంఘాలకు రూ.26.19 కోట్ల మేర బ్యాంకు లింకేజి కల్పించాల్సి ఉండగా 702 సంఘాలకు రూ.20.56 కోట్లు కల్పించామన్నారు. వై.యస్.ఆర్ ఆసరా క్రింద 3697 సంఘాలు రూ.125.17

కోట్లకు అర్హత కలిగి ఉన్నారని చెప్పారు. వై.యస్.ర్ పించను కానుక క్రింద శ్రీకాకుళం నగరపాలక సంస్ధ పరిధిలో 8547 మందికి, శ్రీకాకుళం మండలంలో 10,489 మందికి, గార మండలంలో 9525

మందికి వెరశి 28,561 మందికి రూ.7.02 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వై.యస్.ఆర్ పెళ్ళి కానుక క్రింద శ్రీకాకుళం మండలంలో 246 మందికి రూ.74.06 లక్షలు, గార మండంలో 247 మందికి రూ.75.54

లక్షలు విడుదల చేయడం జరిగిందని వివరించారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు నియోజకవర్గంలో చేపడుతున్న పనులను వివరించారు. ఈ సందర్భంగా 16 మంది

స్ట్రీట్ వెండార్స్ కు  à°¶à±à°°à±€à°•à±‚ర్మం ఆంధ్రా బ్యాంకు విడుదల చేసిన  à°°à±à°£ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. à°ˆ సమావేశంలో ఏపీడీలు పి.రాధ,à°Žà°‚.పిడి.à°“ à°¡à°¾.విద్యాసాగర్,క్షేత్ర

స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam