DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల కూల్చివేత పాపం ఊరికే పోదు:మంత్రి వెల్లంపల్లి 

హిందూ దేవుళ్ళను వేధించిన ఘనుడు చంద్రబాబు

కూల్చిన ఆలయాలను పరిశీలించిన వెల్లంపల్లి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : చంద్ర బాబు నాయుడు ప్రజలతో పాటు హిందూ దేవుళ్ళని వేధించారని, à°ˆ పాపం ఊరికే పోదని, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

పేర్కొన్నారు. శనివారం సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దేవదాయ, ఇతర అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గల శనీశ్వర ఆలయ ప్రాంతాన్ని

పరిశీలించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ హాయం లో హిందూ దేవుళ్ళకు నిలువ నీడ లేకుండా పుష్కరా లు,రహదారుల విస్తరణ పేరుతో పలు హిందూ దేవాలయాలను కూల్చిన

ఘనత చంద్రబాబు నాయుడు దే అని ప్రజలు, హిందువులను, ఇతర మతస్తుల ను, బాధ పెట్టే విదం గా వారి మనోబావాలు దెబ్బ తీసే విధంగా టిడిపి పాలన కొనసాగిందన్నారు. పుష్కరాల పేరుతో

టిడిపి ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని ఆ సమయం లో హిందూ సేవా సంస్థలతో కలిసి ఆలయాల నిర్మాణం కోసం పోరాడిన విషయం ఈ సందర్భంగా గుర్తు

చేశారు. కూల్చిన ఆలయాలను అదే చోట లేదా ఇతర ప్రాంతాలలో నిర్మించేందుకు వై యస్ ఆర్ సిపి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. హిందూ ధర్మాన్ని వై యస్ ఆర్ సిపి ప్రభుత్వమే

కాపాడుతుందన్నారు. హిందూ మరియు ఇతర మతస్తుల మనోబావాల కు అనుగుణంగా వారికి అండగా వై యస్ ఆర్ సిపి ప్రభుత్వం ఉంటుందన్నారు. వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు సి ఎం అయిన

వెంటనే హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల పునః నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అందులో బాగంగా శనీశ్వర ఆలయం వద్ద తొలగించిన సీతమ్మ వారి పాదాలను త్వరలో అక్కడ

సీతమ్మ వారి పాదాల నిర్మాణం తో నగరం లోని ఆలయాల పునః నిర్మాణం ప్రారంభ మవుతుందన్నరు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam