DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొనసాగుతున్న డాక్ సేవకుల బంద్...


విశాఖపట్నం, మే 30 , 2018 : తపాలా సిబ్బంది (డాక్ సేవక్ లు) గత వారం రోజులు గా చేస్తున్న బంద్ కు తపాలా వ్యవస్థలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బుధవారం నగరం లోని

జీవీఎంసీ కార్యాలయంపై ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా తపాలా సిబ్బంది చేస్తున్న నిరసనలకు పలు వామ పక్ష కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్బంగా

గ్రామీణ డాక్ సేవక్ సంఘం జిల్లా కార్యదర్శి జి బి రెడ్డి మాట్లాడుతూ సుమారు 150 ఏళ్ల చరిత్ర కల్గిన తపాలా శాఖా లో బ్రిటిష్ కాలం లో ఎక్స్ట్రా డ్యూటీ లను

ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ గ్రామీణ ఉద్యోగులుగానే ఉంచి, తగిన వేతనం ఇవ్వక, నన అవస్థలకు గురి చేస్తున్నారని తపాలా సిబ్బంది నిరసనలు

చేస్తున్నారు.

గ్రామాల్లో ఉండే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లుగా మూడు గంటలుగాను, మిగతా ఐదు గంటలు డెలివెర్ ఏజంట్లుగాను, పేకర్లు గాను నిర్ణయించడం జరిగింది. ఇది

తోలి నాళ్ళ నుంచీ కొనసాగుతూనే ఉంది. అయితే డిపార్ట్మెంట్ రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహించమనడం అత్యంత దారుణమన్నారు. అయితే వేతనాలు మాత్రం

వారితో సమానంగా లేవు, డ్యూటీ లు మాత్రం సమానంగా చేయమనడం దారుణమన్నారు. వేతనం మాత్రం ఐదు వేలు నుంచి పది వేలు మధ్య ఉంటుందని, కనీసం సర్వీసు కూడా అమలు కావడం

లేదన్నారు. జనవరి 1 2016 న పే రివిజన్ ఖరారైందని, డిపార్ట్మెంట్ సిబ్బంది కి అమలు చేశారు, కానీ డాక్ సేవకులకు మాత్రం అమలు కావడం లేదన్నారు. దీనికి విరుద్ధంగానే ఈ నెల 22

నుంచి నిరవధిక సమ్మెలో దిగామని, అయినా ప్రభుత్వం లో చలనం లేదన్నారు. డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మాతో పాటే సమ్మె లోకి దిగారని, అయితే వారికి ఏ విధమైన హెచ్చరికలు

జారీ అయ్యాయో తెలియదని, వెంటనే వారు విధుల్లో చేరి పోయారన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam