DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోమవారం గోదావరి ఘటన స్థలి కి సీఎం జగన్

బాధితుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరామర్శ  

రాత్రి కూడా  à°•à±Šà°¨à°¸à°¾à°—ుతున్న సహాయ చర్యలు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . . 

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘటన

స్థలాన్ని సందర్శించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఆయన రేపు దేవీపట్నం వెళుతున్నారు. అధికారులతో కలిసి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని

పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. బోటు మునిగిన ఘటనలో 39 మంది గల్లంతు కాగా, ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు.

కొనసాగుతున్న గాలింపు

చర్యలు : . . . 

గోదావరి నదిలో ఓ పర్యాటక బోటు మునిగిపోవడం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ బోటులో

ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద à°ˆ ప్రమాదం జరగ్గా,  à°…నేకమంది గల్లంతయ్యారు. కొందరు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారి కోసం

గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో సహాయ చర్యలు చేపడుతున్నారు. 

గాలింపు

చర్యల్లో 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 6 అగ్నిమాపక బృందాలు, నేవీ గజ ఈతగాళ్లు కూడా కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే 2

హెలికాప్టర్లు, 8 బోట్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. రేపు ఉత్తరాఖండ్ నుంచి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తూర్పుగోదావరి జిల్లాకు

రానున్నాయి. మృతదేహాల కోసం సైడ్ స్కాన్ సోనార్ వ్యవస్థతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam