DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా కు  అవరోధం సరి కాదు: మాజీ ఎమ్మెల్యే పార్థసారథి 

40 శాతం ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది   

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం) . . .

అనంతపురం, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం

జిల్లా పెనుకొండ ఆర్డీఓ శ్రీనివాసులుకు మాజి ఎమ్మేల్యే బికే పార్థసారథి వైయస్సార్ సిపి పార్టి ఆగడాలపై ఫిర్యాదు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

మరియు టివి5 ఛానల్ లను నిషేధించడం పై మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పెనుకొండ ఎన్టీఆర్ సర్కిల్ నుండి  à°…ంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్రగా వచ్చి రాష్ట్రంలో తుగ్లక్

పాలన నడుస్తోందని ,వైయస్ జగన్పై నిప్పులు చెరిగారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న టువంటి వైయస్ జగన్ రాష్ట్రాన్ని  à°…దో గతి పాలు చేశారని

తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్ మరియు ఛానల్ అనేక తప్పుడు కథనాలను ప్రచారం చేసిందని అయినా కూడా సాక్షి పేపర్ పైన  à°®à±€à°¡à°¿à°¯à°¾ పైన

ఎటువంటి ఆంక్షలు విధించ లేదని గుర్తు చేశారు .అలాంటిది ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు tv5  à°›à°¾à°¨à°³à±à°² ప్రసారాలను నిలిపి వేయడం అన్యాయమని తెలిపారు. అలాగే కే

నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన టిడిపి కార్యకర్తలను టార్గేట్ చేస్తూ వందల మంది అర్హులకు అందుతున్న పెన్షన్లు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు .

పెన్షన్ కావాలంటే తమ పార్టి కండువా కప్పుకోవాలని బేదిరిస్తున్నట్లు తెలిపారు . ఈ సంధర్భంగా ఆయన మీడియాతొ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు .

టిడిపి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అటకేక్కిచడమే కాకుండా కక్ష సాధింపే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయడం సిగ్గుచేటన్నారు .ఇప్పటికే ప్రజల్లో 40 శాతం

ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు .ముఖ్యమంత్రీ జగన్ అధికారం శాస్వతం అనుకుంటున్నారని ఎద్దేవా చేసారు . ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన గుణపాఠం

తప్పకుండా నేర్పుతారని ఆయన తెలిపారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam