DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యావరణ భక్షకి యురేనియం త్రవ్వకాలు ఆపాలి : జన సేనాని    

నల్లమలలో యురేనియం అన్వేషణ నిలుపుదల చేయాలి  

పవన్ కళ్యాణ్ అద్యక్షతన à°…à°–à°¿à°² పక్ష సమావేశం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . . .

హైదరాబాద్ , సెప్టెంబర్ 16, 2019

(డిఎన్‌ఎస్‌) : పర్యావరణ భక్షకి à°—à°¾  à°¤à°¯à°¾à°°à±ˆà°¨  à°¯à±à°°à±‡à°¨à°¿à°¯à°‚ మూలక అన్వేషణ, త్రవ్వకాలను తక్షణం నిలుపుదల చెయ్యాలని జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. సోమవారం

సాయంత్రం హైదరాబాద్ లో నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను ఆపాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో మరియు ఇతర రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, సైంటిస్టులు, నల్లమల వాసులు,

ఉద్యమకారులతో అఖిలపక్షం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రమాదకర అణుధార్మిక ధాతువైన

యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని à°…à°–à°¿à°² పక్షం డిమాండ్ చేస్తోంది. 
ఇప్పటికే యురేనియం అన్వేషణ, తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలను ఈ సభ కోరడం జరిగింది. కడప జిల్లా తుమ్మలపల్లిలో జరుగుతున్న యురేనియం మైనింగ్ ను తక్షణం ఆపాలని, తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో

చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతను ఇవ్వాలని à°ˆ సమావేశం డిమాండ్ చేస్తోంది. 
అదే విధంగా గతంలో నల్గొండ జిల్లాలో యురేనియం అన్వేషణ తీరు వల్ల ప్రజలకు

అపార నష్టం కలిగిందని, అందువల్ల ఈ అఖిల పక్ష సమావేశం సూచించిన డిమాండ్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ పై అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ

తీర్మానించింది.
ఈ సమావేశం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ కుప్పం కుమార్ రెడ్డి,

జనసేన ప్రతినిధి నాదెండ్ల  à°®à°¨à±‹à°¹à°°à±, ఇతర  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.     

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam