DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమణ దీక్షితుల ఆరోపణలపై సీబీఐ విచారణ చేయిస్తే తప్పేంటి ? ఉండవల్లి. 

రాజమహేంద్రవరం, మే  30. 2018 (DNS Online) : టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు

ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ని దుయ్యబట్టారు. అధికారం లో ఉండగా

చెయ్యవలసిన పని చంద్రబాబు చెయ్యడం లేదన్నారు. ఈ అంశం పై సీబీఐ విచారణ కాకున్నా, మాజీ ఈఓ లతో ఒక కమిటీ వేసి విచారణ జరిపించవచ్చన్నారు. ఇదే పెద్ద మనిషి, 2008 అసెంబ్లీ

సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై

ఉందన్నారు. నాలుగేళ్లుగా బీజేపీ తో కలిసి యుండగా ఒక బీజేపీ సభ్యున్ని టిటిడి బోర్డు లో నియమించారంటే అర్ధం ఉంది కానీ, బీజేపీ తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా

మహారాష్ట్ర లో అధికారం లో ఉన్న బీజేపీ మంత్రి భార్య సప్నా ను టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారో చెప్పాలని చంద్రబాబును ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌

చేశారు.

 

pix: courtesy : to whomsoever
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam