DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు కృషి: జెసి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలోని రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు రాష్ట్ర

ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వమే పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి

రైతులకు మద్ధతు ధరను పలికేందుకు ప్రయత్నం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల

ఏర్పాటు, సార్టెక్స్ రైస్ పంపిణీ వంటి అంశాలపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులు మరియు రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నాణ్యమైన

బియ్యం పంపిణీ (సార్టెక్స్ రైస్ మిషన్ల ద్వారా  à°šà±‡à°¯à°¬à°¡à°¿à°¨) 5,10,15,20,25 కేజీల బ్యాగులలో పంపిణీ చేస్తున్న సంగతిని ఆయన గుర్తుచేసారు. వీటిని తూర్పు గోదావరి జిల్లాల నుండి

దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, అదే జిల్లాలోనే సార్టెక్స్ మిషన్లు ఉంటే జిల్లాలోని రైస్ మిల్లర్లే బియ్యం పంపిణీ చేయవచ్చని సూచించారు. ఇందుకు రైస్ మిల్లర్ల

నుండి సంయుక్త కలెక్టర్ అభిప్రాయాలను కోరగా, సార్టెక్స్ రైస్ మిషన్ పూర్తిగా స్విట్జర్లాండ్ టెక్నాలజీకి చెందినదని, నాణ్యమైన బియ్యాన్ని అందించడం దీని

ప్రత్యేకత అని  à°°à±ˆà°¸à± మిల్లర్ల సభ్యులు సంయుక్త కలెక్టర్ కు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో50 కేజీల ప్యాకింగ్ మిషన్లు మాత్రమే ఉన్నాయని, సార్టెక్స్ రైస్ మిషన్ల

ఏర్పాటుకు సింగిల్ షెల్లర్ ఉన్న వాటికి  à°°à±‚.35 లక్షల వరకు , డబుల్ షెల్లర్ ఉన్నవాటికి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని, అంతేకాకుండా వీటిని ఏర్పాటుచేసేందుకు కంపెనీ

నిబంధనల మేరకు అదనంగా మరో రూ.15 లక్షల వరకు వ్యయం కాగలదని సభ్యులు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కొంతమేర సబ్సిడీని,  à°¨à°¿à°¬à°‚ధనల్లో కొంతమేర సడలింపు ప్రకటిస్తే

బాగుంటుందని తెలియజేయగా ప్రభుత్వంతో మాట్లాడి మరోమారు సమావేశం ఏర్పాటుచేస్తామని, ఆ సమావేశంలో తుది నిర్ణయం ప్రకటిస్తామని సంయుక్త కలెక్టర్ మిల్లర్లకు

వివరించారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి యం.వి.రమణ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా సరఫరాల అధికారి నాగేశ్వరరావు, జిల్లా

రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు వాసు, కార్యదర్శి గోపాల్, కమిటీ సభ్యులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam