DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పడవ వెలికితీతకు రంగంలోకి బలిమెల రెస్క్యూ బృందం

గోదారి లో మునిగిన పడవ వెలికి తీతకు యత్నాలు 

ఆఖరి వ్యక్తిని వెలికి తీసే వరకూ శ్రమిస్తాం: మంత్రి అవంతి 

పడవ 315 అడుగుల ఉన్నట్టు హెలికాఫ్టర్

కనుగొంది.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్ఛులురు

ప్రాంతంలోని గోదావరి లో మునిగిన పడవ వెలికి తీతకు ప్రయత్నం జరుగుతోందని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. దేవీపట్నం లోని ఘటన స్థానం దగ్గరలో

విలేకరులతో మాట్లాడుతూ గతం లో ఒరిస్సా లోని బలిమెల ఘటనలో సఫలీకృతమైన   భారత నావికాదళం, à°“ ఏన్ జి సి, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నిపుణులతో కూడిన బృందాన్ని à°ˆ పడవ ను

వెలికి తీసేందుకు నియుక్తం చేసినట్టు తెలిపారు. ఈ ప్రమాదం లో చిక్కుకున్న ఆఖరి వ్యక్తిని వెలికి తీసే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెలికి తీత కొనసాగుతుందన్నారు.

మొత్తం పడవలో 73 మంది ఉన్నారని, వీరిలో 26 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, మరో 26 మంది విగతజీవులుగా ఒడ్డుకు చేరారన్నారు.  
ఈ మునిగిన పడవ 315 అడుగుల క్రింద

ఉన్నట్టుగా హెలికాఫ్టర్ ద్వారా కనుగొన్నట్టు అయన తెలిపారు. అంత అడుగున వెతుకులాట కష్టమని, నిపులను నియోగించినట్టు తెలియచేసారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్టు

మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, గాయ పడిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, సురక్షితంగా బయట పడిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు

అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన విగతులను బయట వెలికి తీసేందుకు పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖా, పర్యాటక, పోర్ట్ విభాగాలకు చెందిన అధికారులతో కంట్రోల్

రూమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam