DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మైహోం రామేశ్వర్, ఇన్ఫోసిస్ సుధ లకు టిటిడి లో స్థానం,

ఎట్టకేలకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు సభ్యులా  à°¨à°¿à°¯à°¾à°®à°•à°‚ 
 
(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌):దేశంలోనే అత్యంత

ప్రతిస్త్మాకమైన తిరుమల తిరుపతి దేవస్థానములు ( టీటీడీ ) క్షేత్రానికి పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్ర ప్రదేశ్   ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మందికి (చైర్మన్

కాకుండా) సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్టు ఇటీవలే రాజపత్రం విడుదల కూడా చేసింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి

నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఆంధ్ర

ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ కు కూడా ఈ టిటిడి బోర్డు లో స్థానం కల్పిస్తారు అనే వార్తలు వినవచ్చాయి. ప్రస్తుతం ఆ పేరు ప్రస్తావనే ఈ కమిటీలో లేక పోవడం

గమనార్హం. 

ఆంధ్ర ప్రదేశ్ నుంచి : . . .

పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి,

మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పార్థసారథి పేర్లను ప్రకటించింది. 

తెలంగాణ నుంచి: . . .  

మై హోమ్ సంస్థల అధినేత జూపల్లి

రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, à°¡à°¿.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది.

ఢిల్లీ

నుంచి  à°¶à°¿à°µà°¶à°‚కరన్‌, 

మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మ, 

కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, 

తమిళనాడు నుంచి వైద్యనాథన్‌,

శ్రీనివాసన్‌, à°¡à°¾.నిశ్చిత, కుమారగురు పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ప్రకటించిన పేర్లను చూస్తే.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కొందరికి టీటీడీ సభ్యులుగా

అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam