DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సబ్ మెరైన్ కోర్సులో 129 మంది నేవి సిబ్బంది కి  శిక్షణ    

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు నావికాదళం నిర్వహించిన సబ్ మెరైన్ కోర్సులో 129 మంది నేవి సిబ్బంది ఉత్తీర్ణత పొందారు.

మంగళవారం ఐఎన్ ఎస్  à°¶à°¾à°¤à°µà°¾à°¹à°¨ లో జరిగిన పాసింగ్ పరేడ్ కార్యక్రమం లో దక్షిణ నావికాదళ అధిపతి కమాండ్ రియర్ అడ్మిరల్ ఆర్ జె నడకర్ణి, ముఖ్య అతిధిగా పాల్గొని

శిక్షార్థులకు ధ్రువ పత్రాలు అందించారు.  à°²à±†à°«à±à°Ÿà°¨à±†à°‚ట్ కార్తికేయ పాండే అన్ని విభాగాల్లో ఆల్ రౌండ్ ప్రతిభకు గాను ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకున్నారు.

మనోజ్ రానా ఉత్త్తమ ఆల్ రౌండ్ నావికునిగా పురస్కారం పొందారు. 

సుమారు 24 వారాల పాటు జరిగిన à°ˆ శిక్షణ లో  21 మంది నావికా దళ అధికారులు, 108 మంది నావికులు, à°ˆ శిక్షణ లో

పాల్గొన్నారు. ఈ ప్రాధమిక శిక్షణ సింధుఘోష్, శిశుమార్ జలాంతర్గాముల్లో ఏప్రిల్ 8, 2019 నుంచి జరిగింది. సబ్ మెరైన్ నిర్మాణం, అంతర్గత యంత్ర అమరిక, ప్రమాద సమయాల్లో

తప్పించుకునే మార్గం, తదితర అంశాలను కూడా వివరించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరం లో ఆటల పోటీలు, జులై 2019 లో తాటిపూడి జలాశయం లో సాహస ప్రక్రియలు కూడా నిర్వహించారు. వీరు

ఆరు నెలల కాలం పాటు సముద్రం పై జలాంతర్గాముల్లో తదుపరి శిక్షణ పొందనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam