DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పడవ వెలికి తీతకు మూడు రోజుల్లో ముంబై టీమ్ 

ఆఖరి వ్యక్తి దొరికేవరకూ ఆపరేషన్ ఆగదు 

మరో 13 మృత దేహాలు దొరకాల్సి ఉంది. 

మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడి. 

గుర్తించడం కష్టంగానే ఉంది :

కలెక్టర్. . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద పాపికొండలు వద్ద

గోదావరి లో మునిగిన పర్యాటక పడవ రాయల్ వసిష్ఠ ను వెలికి తీసేందుకు ముంబై నుంచి అత్యంత నైపుణ్యత కల్గిన బృందం వస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి

పినిపే విశ్వరూప్ తెలిపారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరం లో 
విలేకరుల తో మాట్లాడుతూ ఈ పర్యాటక యాత్ర విషాదాంతం కావడం చాలా బాధాకరం అన్నారు.

సుమారు 315 అడుగుల లోతులో మునిగిన పడవను ఉన్నట్టు నావికా హెలికాఫ్టర్ బృందం కనుక్కొందని తెలిపారు. దాన్ని బయటకు తీసేందుకు ముంబై నుంచి బృందాన్ని తీసుకురావడం

జరుగుతోందన్నారు. à°ˆ మేరకు వాళ్లతో మాట్లాడినట్టు తెలిపారు. 
గత 72 గంటలు గా గోదావరి లో వెతుకులాట జరుగుతుందని, ఇంతవరకూ 34 విగతులను నదినుంచి వెలికి తీసి పంచనామా

అనంతరం వాటిని బంధువులకు అప్పగించామన్నారు. సుమారు వెయ్యి మంది సహాయక సభ్యులు ఈ వెతుకులాట పనిలో నిమగ్నమై యున్నట్టు తెలిపారు. జిల్లా యంత్రాంగం తన పని తానూ

చేసుకు వెళ్తుందని, సముద్ర ముఖద్వారం వద్ద కూడా కొన్ని బృందాలను  à°•à°¾à°ªà°²à°¾ ఉంచామన్నారు. మృతులకు రూ. 10 లక్షలు, గాయాల పాలైన వారికీ రూ. 3 లక్షలు, సురక్షితంగా బయట పడిన

వారికీ రూ. 1 లక్ష పరిహారం ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు.    

గుర్తించడం కష్టంగానే ఉంది : కలెక్టర్. . .

తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి

మాట్లాడుతూ మృత దేహాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఇళ్లకు చేర్చడానికి వైద్య సామగ్రితో కూడిన వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు

కావడం తో మృత దేహాలు బాగా దెబ్బతిన్నాయని, వారిని గుర్తించడం కష్టతరంగానే ఉందన్నారు. వారి జేబుల్లో ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, ధరించిన నగలు,

దుస్తులు తదితర వస్తువుల ఆధారంగా మృతులను వారి బంధువులు గుర్తించడం జరుగుతోందన్నారు. 
 
మంత్రి వెంట సంయుక్తర్ కలెక్టర్ లక్ష్మి షా, సబ్ కలెక్టర్ ఆర్. మహేష్,

ఇతర అధికారులు ఉన్నారు. 
కాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడి నుంచి పాపికొండలు విహార యాత్రకు రాయల్ వసిష్ఠ పడవ సుమారు 73  à°®à°‚ది తో గోదావరి లో

ప్రయాణించింది. కచ్ఛులురు వద్ద సుడిగుండంలో దురదృష్టవశాత్తు మునిగిన విషయం తెలిసిందే. 

రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భారత్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో

బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ప్రభుత్వం బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతుందని తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam