DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దమ్ముంటే ప్రజా క్షేత్రం లోకి రా . . . చంద్రబాబు కి బీజేపీ సవాల్ 

టీడీపీ à°•à°¿ ఓటు వేస్తె కాంగ్రెస్ కు వేసినట్టే :  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ రెడ్డి. 

మహానాడు అంతా మోడీ జపమే. . .

మహానాడు టీడీపీ

మీటింగా లేక బీజేపీ మీటింగో తెలియలేదు. 

విశాఖపట్నం, మే 31, 2018 (DNS Online) : మోడీ జపం చెయ్యనికే తెలుగుదేశం పార్టీకి గతి లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి ఎస్ సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నగరం లోని బీజేపీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ నాలుగేళ్ల కాలం

బీజేపీ తో పొత్తు లో ఉన్న సమయం లో మోడీ గురించి తెలియలేదా, తన స్వార్ధం కోసం విడిపోయిన తర్వాతే చంద్రబాబు నాయుడు తన అసలు రంగు బయట పెట్టుకున్నారన్నారు. ఇటీవల

విజయవాడ లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు లో ప్రసంగించిన ప్రతీ ఒక్కరూ నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పేర్లూ లేకుండా ఒక్కడు కూడా

నోరు విప్పలేక పోయారని, అక్కడ జరిగింది తెలుగుదేశం మీటింగో లేక బీజేపీ మీటింగో తెలియకుండా వాళ్ళే చేసుకున్నారన్నారు. 

నాలుగేళ్లుగా కేంద్రం నుంచి

తెచ్చుకున్న కోట్లాది రూపాయల నిధులకు లెక్కలు అడగడమే మహా పాపంగా తెలుగుదేశం భావించిందన్నారు. అన్ని రాష్ట్రాలను అడిగినట్టే ఆంధ్రా ను కూడా లెక్కలు అడిగారని,

అయితే అవినీతి మాయం గా మారిపోయిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ లెక్కలకు జవాబు చెప్పలేక మోడీ పై నిందలు అభాండాలు వేస్తోందన్నారు.

ఈ దేశం లో కుళ్ళు

కుతంత్ర రాజకీయాలకు మారుపేరుగా చంద్రబాబు అండ్ కో తయారయ్యారని, కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు వ్యతిరేకంగా 1982 లో ఎన్ à°Ÿà°¿  à°°à°¾à°®à°¾à°°à°¾à°µà± తెలుగుదేశం పార్టీని

స్థాపించారని సురేష్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు తన స్వార్ధం కోసం తమ పార్టీ వ్యవస్థాపకుడు వ్యతిరేకించిన, విభేదించిన కాంగ్రెస్ తో

కుమ్మక్కై, లాలూచీ పడిన విషయం కర్ణాటక ఎన్నికల్లో ఈ దేశ ప్రజలకు తెలిసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ తన కుయుక్తులతో

చంద్రబాబు తో దోస్తీ కట్టి, 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు దొంగదారిన సిద్ద పడుతోందన్నారు. ఇక పై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తెలుగు దేశానికి ఓటు వేస్తె అది కచ్చితంగా

కాంగ్రెస్ కు ఓటు వేసినట్టే అని అన్నారు. 

చంద్రబాబు కు దమ్ము ఉంటె కేంద్రం ఇప్పడి వరకు ఇచ్చిన నిధులకు సరైన లెక్కలు చూపించాలని సవాల్ విసిరారు. అది చేతకాక

తెలుగుదేశం లోని గల్లీ స్థాయి కార్యకర్తల తో దేశ ప్రధాని, బీజేపీ జాతీయ అద్యక్షులని బహిరంగంగా తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  à°°à±‹à°¡à±à°¡à±à°¨

వెళ్లేతప్పుడు పిపీలకాలు, చీమలు లాంటి క్రిములని, ఈ వ్యాఖ్యలు చేసి నేతలని పట్టించుకునే తీరిక మోడీ వద్ద లేదన్నారు. ఈ విలేకరుల సమావేశం సీనియర్ నాయకులూ

సుబ్బరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam