DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవ వనరులే మన పెట్టుబడి : మంత్రి మేకపాటి 

విద్యుత్ వాహన రంగానికి ప్రాధాన్యం

వాణిజ్య కామర్స్ రంగాల పైననే ఆర్థికాభివృద్ధి

పారిశ్రామికవేత్తలకు ఏపీలో అపార అవకాశాలు

(DNS రిపోర్ట్ : సత్య

గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రం పరిశ్రమలకు కేంద్రస్థానంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు,

కామర్స్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గేట్ వే హోటల్ లో ఆంధ్ర ప్రదేశ్ చాంబర్స్ నిర్వహించిన కాన్సులేట్ బిజినెస్ మీట్ కు ఆయన ముఖ్య

అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించిన నాడే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి

చెందుతుందన్నారు. ఆచరణాత్మక కార్యక్రమాలతో పారిశ్రామికరంగం లో రాష్ట్రాన్ని ముందుండేలా తీర్చిదిద్దుతా మన్నారు. ఏ దేశంలో లేనంతగా మన రాష్ట్రంలో అపారమైన

నైపుణ్యత కలిగిన మానవ వనరులు ఉన్నాయని, వారిని సక్రమంగా వినియోగించుకుంటే పెట్టుబడులు  à°µà°¾à°Ÿà°‚తటవే వచ్చే వీలుంటుందన్నారు.రాష్ట్రంలో మానవ వనరులు అంతర్జాతీయ

ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి ప్రపంచంలో మేటి గా తీర్చిదిద్దుతామన్నారు. పరిశ్రమలకు సులువుగా అనుమతులు ఇచ్చే ఏక గవాక్ష పద్దతి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా

ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.త్వరలో నే రాష్ట్రంలో నూతన ఎలక్ట్రిల్ వాహనాల పాలసీ తీసుకువస్తాం మన్నారు. రాష్ట్రంలో నీటి

వనరులు వినియోగించుకుంటూ ప్రరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. జిల్లాల వారిగా ఆయా పరిశ్రమలకు అనువైన, కావలిసిన భూమిని సమకూర్చి ,  à°®à±Œà°²à°¿à°• వసతులు

కల్పిస్తామని తెలిపారు.

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు మాట్లాడుతూ విశాఖపట్నం పారిశ్రామికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం

అని, ప్రపంచ పెట్టుబడిదారులకు అన్ని రంగాలలో ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయా రంగాల అభివృద్ధికి వారికి దిశానిర్ధేశం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని

తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో వివిధ రకాల పెట్టుబడులకు ఆస్కారం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే బ్రాండిక్స్ ,

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గంగవరం పోర్టు మొదలైన ఎన్నో రకాలుగా పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్నారు. తమ ప్రభుత్వం మూడు నెలల కాలంలోనే 4లక్షల మందికి ఉద్యోగాలు

కల్పించిందని తెలిపారు.  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à°•à± కావలసిన అన్ని అనుమతులను తక్షణం మంజూరు చేయాలని వారికి, స్థానికుల నుండి ఎటువంటి హెచ్చరికలు ఆందోళనలు లేకుండా చూడాలని

జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎంతో మంది పెట్టుబడిదారులు స్థానికుల సహాయ సహకారాలతో అభివృద్ధి చెందడం తనకు తెలుసునని ఈ సందర్భంగా ఆయన

వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నౌకాశ్రయాలకు సమీపంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలన్నారు.

దేవాలయ, ఆధ్యాత్మిక పర్యటనకు తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు సభ్యులు ఎ. రఘురామ కృష్ణరాజు, ఏపీ చాంబర్స్ అధ్యక్షులు జి

సాంబశివరావు వివిధ దేశాలకు చెందిన కన్సులేట్స్, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam