DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గృహ నిర్మాణాల పరిశీలన వేగవంతం చేయాలి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలో గృహ నిర్మాణాల లబ్దిదారుల పరిశీలన వేగవంతంగా

పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ప్రగతిపై జిల్లా కలెక్టర్ శుక్ర వారం సమీక్షించారు. జిల్లాలో గతంలో మంజూరైన గృహాల

లబ్ధిదారుల అర్హతలు, పనుల ప్రగతిని వేగవంతంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు పరిశీలన పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. పట్టణ

ప్రాంతాల్లో పరిశీలన మరింత జాప్యంపై ప్రశ్నించారు. నిర్మాణ పనుల ప్రగతిలో వేగం కనిపించడం లేదని ఆయన అన్నారు. పోలాకి, జి సిగడాం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, భామిని, గార,

బూర్జ, ఇచ్చాపురం, జలుమూరు, కంచిలి, నరసన్నపేట మండలాల్లో నిర్మాణాల ప్రగతి మరింత దారుణంగా ఉన్నాయని అన్నారు. అతి తక్కువ శాతం పనులు పూర్తి కావడం పట్ల పోలాకి సహాయ

ఇంజనీరు పి.మురళీమోహన రావును ప్రశ్నించగా సంతృప్తికర సమాధానం చెప్పకపోవడంతో సమావేశం నుండి బయటకు వెళ్ళవలసినదిగా ఆదేశించారు. సమావేశానికి వచ్చేటపుడు పూర్తి

సమాచారంతో రావాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రగతిపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహించని ఇంజనీర్లను, సిబ్బందిని

సస్పెన్షన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిలో జిల్లా వెనుకబడిన సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసని పేర్కొంటూ ఉండటానికి ఇళ్ళు ఉంటే చాలు అనుకునే పేద

ప్రజానీకం అనేక మంది జిల్లాలో ఉన్నారని అన్నారు. పేద ప్రజానీకానికి ఇళ్ళు నిర్మించడంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలని కలెక్టర్ చెప్పారు. త్వరితగతిన

ఇళ్ళు నిర్మించి వారిలో ఆనందాన్ని చూడాలనే తపనతో పనిచేయాలని అన్నారు. వర్షం పడితే జీవనం కష్టంగా మారుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయని అటువంటి వారికి అండగా

ఉండాలని, వారికి à°’à°• ఇళ్ళు కల్పించాలనే కోరిక కలగాలని పేర్కొన్నారు.  à°‡à°³à±à°² స్థలాలకు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగులు కూడా

దరఖాస్తు చేస్తున్నట్లు పరిశీలనలో తెలిస్తుందని, పాతపట్నంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసినట్లు ఆర్టీజీఎస్ లో తేలిందని ఆయన తెలిపారు. ప్రతి

మండలంలో గృహ నిర్మాణాలకు సిమెంటు గిడ్డంగి ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. గృహ నిర్మాణ లబ్దిదారుల బ్యాంకు ఖాతాలు సరిచూడాలని ఆయన ఆదేశించారు. 
గృహ నిర్మాణ

సంస్థ పిడి వేణుగోపాల్ మాట్లాడుతూ 32,465 గృహాలు ప్రగతిలో ఉన్నాయన్నారు. 23,632 గృహాలకు బిల్లుల చెల్లింపుకు పంపించడం జరిగిందని చెప్పారు. రూ.86.97 కోట్ల చెల్లింపు పెండింగ్

లో ఉందని ఆయన వివరించారు. 
కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీనివాసరావు, టి.రమేష్, కూర్మి నాయుడు, కె. రవి కుమార్, ఏపిటిఐడికో కార్యనిర్వాహక ఇంజనీరు బివి రమణమూర్తి,

ఉపకార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam