DNS Media | Latest News, Breaking News And Update In Telugu

23 నుండి అభ్యర్ధుల ధృవీకరణ పత్రాల పరిశీలన

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధుల కార్యాచరణ పై కలెక్టర్  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 20, 2019

(డిఎన్‌ఎస్‌): గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధుల ధృవీకరణ పత్రాలను 23à°µ తేదీ నుండి 25à°µ తేదీ వరకు మూడు రోజుల పాటు పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్

తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనపై జిల్లా కలెక్టర్ నివాస్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ నెల 23

నుండి 25 వరకు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలలో అర్హులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల

ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎచ్చెర్లలోగల శివాని ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలతోపాటు మునసబుపేట

గాయత్రి డిగ్రీ కళాశాలలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పోస్టులు కలిగిన సంబంధిత శాఖలు, మునిసిపాలిటీలు

తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాఖలు, మునిసిపాలిటీలు ధృవీకరణ పత్రాలు పరిశీలనకు బృందాలు నియమించాలని అన్నారు. అభ్యర్థులు అప్ లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలను

ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పరిశీలించాలని అందుకు చెక్ లిస్టును ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థుల సహాయార్ధం ఇంటర్నెట్ తో

కూడిన కంప్యూటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోజుకు మూడు వేల మందికి పైగా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు ఏర్పాట్లు అవసరమని అన్నారు. జిల్లాలో  à°—్రామ,

వార్డులకు 10 వేల మంది వరకు అభ్యర్థుల పత్రాలు పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, తాజా కుల ధ్రువీకరణ పత్రం, 4 నుండి 10వ

తరగతి వరకు చదివిన పత్రాలు, ఆర్థో, విసువల్ తదితర అంగవైకల్యానికి సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేయాలని వివరించారు. జిరాక్స్ కాపీలను

సమర్పించాలని పేర్కొన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో అత్యంత జాగరూకత వహించాలని ఆదేశించారు. గతంలో ఎస్.సి, ఎస్.టి లుగా కొన్ని కులాలు తీసుకున్నప్పటికీ

ప్రస్తుతం వాటిని నిలుపుదల చేయడం జరిగిందని స్పష్టం చేసారు. స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, క్రిమీ లేయర్ పత్రాలు సమర్పించాలని అన్నారు. ధృవీకరణ పత్రాలకు కాల్

లెటర్ పంపించే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరి కాల్ లెటర్ ఇంకొకరి, లేదా ఒక పోస్టుకు బదులుగా మరో పోస్టుకు పంపించకుండా

పక్కాగా పరిశీలించాలని అన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, ఆర్డీవో ఎం.వి.రమణ, జెడ్పీ సిఇఓ జె. చక్రధర రావు, నగర పాలక సంస్థ కమిషనర్

ఎం.గీత దేవీ, డీపీఓ వి.రవి కుమార్, పీఆర్ ఎస్.ఇ ఎస్.రామ్మోహన్, డిఇఓ కె.చంద్ర కళ, డి.ఎం.హెచ్.ఓ డా.ఎం.చెంచయ్య, మత్స్య శాఖ జెడి డా వివి కృష్ణ మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి

కె వి ఆదిత్య లక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి బిజిడి ప్రసాద్, పశుసంవర్ధక శాఖ జెడి ఏ.ఈశ్వర రావు, ఉద్యాన శాఖ ఏడి ఆర్.వి.వి.ప్రసాద్, ఏపీఎంఐపి పిడి ఏవిఎస్వి జమదగ్ని,

సెరికల్చర్ ఏడి త్రినాథ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసరావు, డిఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్,  à°®à±à°¨à°¿à°¸à°¿à°ªà°²à± కమిషనర్లు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam