DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి చర్యతో గురజాడ సాక్షిగా యార్లగడ్డ కు అవమానం

మంత్రి పరపతి కోసం జివిఎంసి ఓవర్ ఏక్షన్

విశాఖ కాంప్లెక్ వద్ద గురజాడ జయంతిలో సిబ్బంది హంగామా  

అధికార భాష సంఘం వేసిన పూమాలను తొలగించిన జివిఎంసి

 

ముందు వేసిన దండ తొలగించరాదు : . . .

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ) :. .

విశాఖపట్నం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à°‚à°˜ సంస్కర్త, నవయుగ

వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతి ని పురస్కరించుకుని విశాఖ లో జరిగిన ఘటన అధికారుల అధికార దర్పానికి,  à°®à°‚త్రుల ప్రాపకానికి వెంపర్లాడుతున్న విధానానికి

ప్రత్యక్ష సాక్ష్యంగా   నిలిచింది. అధికార భాష సంఘం అధ్యక్షుడు వేసిన దందాను నిర్దాక్షిణ్యంగా విసిరేసిన జివిఎంసి అధికారి. . 

శనివారం ఉదయం 8 : 30 గంటలకు :. .

.

విశాఖ నగరం లోని ద్వారకా బస్ కాంప్లెక్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న గురజాడ విగ్రహం వద్ద శనివారం ఉదయం 8 : 30 గంటల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష సంఘం

అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూలమాల వేసి గాని నివాళి అర్పించారు. అనంతరం ఆయన విజయనగరం లో జరుగుతున్న గురజాడ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు

వెళ్లారు. ఈయన తో పాటు పలువురు నగర ప్రముఖులు à°ˆ కార్యక్రమం లో పాల్గొన్నారు. 

శనివారం ఉదయం 10 : 30 గంటలకు :. . .

ఈ సమయం వరకూ ఈ విగ్రహానికి యార్లగడ్డ వేసిన పూలమాల

ఒక్కటే ఉంది. ఇదే విగ్రహానికి రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ నివాళి అర్పించేందుకు రావాల్సియుంది.   మంత్రి à°•à°¿ స్వాగతం పలికేందుకు కోసం

గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడే ఎదురుచూస్తున్నారు.  à°ˆ సమయంలోనే జీవీఎంసీ అధికారి శ్రీనివాసరావు (యుజిడి విభాగం ఉన్నతాధికారి)

గురజాడ విగ్రహాన్ని చూసి,  à°®à°‚త్రికంటే ముందుగానే దండ వేసింది ఎవరు అంటూ నానా హంగామా చేసి, ఒక్కసారిగా విగ్రహం దగ్గరకు వెళ్లి అంతకు ముందే యార్లగడ్డ లక్ష్మి

ప్రసాద్ వేసిన పూలమాలను విసిరేయడం తో అందరూ విస్తు పోయారు. 

మంత్రి ప్రాపకం కోసం ప్రాకులాట :. . . 

మంత్రి ప్రాపకం కోసం జివిఎంసి అధికారి చేసిన నిర్వాకం

అధికార భాష సంఘం అధ్యక్షునికి ఘోర అవమానంగా పరిణమించింది. మంత్రి వెంట వచ్చిన అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పాటి గౌరవం అధికార భాష సంఘం అధ్యక్షునికి

జివిఎంసి ఇవ్వలేదంటే వీళ్ళు ఏ స్థాయిలో అధికార పార్టీ ని మోస్తున్నారో అందరికీ మరో సారి తెలిసింది. 

ఈ రెండు కార్యక్రమాలూ రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది

పరిధిలోకే వస్తాయి. పైగా రెండింటి సమాచారం కూడా రాష్ట్ర సమాచార శాఖే ఇచ్చింది. అయితే  à°°à±†à°‚డు వేర్వేరు సమయాలు కావడం గమనార్హం. సమాచార శాఖా ఇద్దరి కార్యక్రమాలను

ముందుగానే ప్రకటించింది. అయితే జివిఎంసి అధికారి ఓవర్ ఆక్షన్ శృతిమించడం తో కార్యక్రమం వికటించింది.  à°®à°‚త్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో పాటు, జిల్లా

ఇంచార్జి మంత్రి మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

ముందు వేసిన దండ తొలగించరాదు : . . .

మంత్రి

వచ్చి గురజాడకు నివాళి అర్పించడానికి వచ్చిన సమయంలో ఆ విగ్రహానికి అదే రోజు ముందుగా ఎవరైనా దండ వేసి యుంటే అది తొలగించకూడదు. ఇది ముందువారికి అవమానం. ఏ

విగ్రహానికైనా దండ వేసేది వారికీ నివాళి అర్పించడానికి. నివాళి అర్పించడం రాజు -పేద,  à°®à°‚త్రి - సామాన్యుడు ఇలాంటి తేడాలు ఉండవు. ఎవరు తెలిపినా అది నివాళే.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam