DNS Media | Latest News, Breaking News And Update In Telugu

3 కాలేజీల్లో సచివాలయ అభ్యర్ధుల పత్రాలు పరిశీలన

శివాని ఇంజనీరింగ్ కాలేజీ :  à°—్రామ కార్యదర్శులు,

వెంకటేశ్వర ఇంజనీరింగు కాలేజీ: సర్వేయర్, విద్య

గాయత్రి డిగ్రీ కళాశాలలో మత్స్యశాఖ

(DNS

రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్ధుల ధృవీకరణ పత్రాలను మూడు

కళాశాలల్లో పరిశీలనకు ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఎచ్చెర్లలోగల శివాని ఇంజినీరింగు కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాల,

మునసబుపేటలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ధృవపత్రాలు ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు పరిశీలించడం జరుగుతుందని అభ్యర్ధులు 22, 23

తేదీల్లో విధిగా గ్రామ సచివాలయ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. à°ˆ మేరకు శని వారం à°’à°• ప్రకటన విడుదల చేసారు. 

శివాని ఇంజనీరింగు

కళాశాలలో – పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వి.ఆర్.ఓలు, ఏ.ఎన్.à°Žà°‚, పశుసంవర్ధక అసిస్టెంట్ల పరిశీలన

శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో – గ్రామ

సర్వేయర్, విద్య- సంక్షేమ సహాయకులు, అన్ని మునిసిపాలిటీల వార్డు సచివాలయానికి చెందిన అన్ని పోస్టులకు పరిశీలన

గాయత్రి డిగ్రీ కళాశాలలో – మత్స్యశాఖ,

సెరీకల్చర్, వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్ల పోస్టులు, మహిళా ప్రొటెక్షన్ అధికారి, ఇంజనీరింగు అసిస్టెంట్ల పోస్టులకు పరిశీలన ఉంటుందని కలెక్టర్

వివరించారు. 

మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్ధులకు ధృవపత్రాల పరిశీలనకు కాల్ లెటర్ ను ఎస్.ఎం.ఎస్, ఇ- మెయిల్ ఆధారంగా పంపించడం జరుగుతుందని తెలిపారు. కాల్ లెటర్

లో అభ్యర్ధి హాజరు కావలసిన తేది, సమయం, పరిశీలన స్ధలం తెలియజేస్తున్నామని చెప్పారు. కేటాయించిన కళాశాలకు సకాలంలో అభర్ధులు చేరుకొని పత్రాల పరిశీలన గదిని ముందుగా

తెలుసుకోవాలని ఆయన కోరారు.  à°…భ్యర్ధులు 22,23 తేదీల్లో 4 నుండి 7à°µ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్, విద్యార్హతలు, అభ్యర్ధుల వద్ద ప్రస్తుతం ఉన్న తాజా (లేటెస్ట్) కుల

ధృవీకరణ పత్రం, బి.సి అభ్యర్ధులు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ (తహశీల్దార్ నుండి మాన్యువల్ గా పొందిన సర్టిఫికేట్ కూడా సరిపోతుంది), క్రీడాకారులు, ఎక్స్

సర్వీసుమెన్ తమ సర్టిఫికేట్లను, దివ్యాంగులు సదరం నుండి పొందిన సర్టిఫికేట్లు, రెండు ఫోటోలు అప్ లోడ్ చేయాలి. ధృవీకరణ పత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్ధులు రెండు

సెట్ల జెరాక్సు కాపీలను, ఫోటోల వెనుక పేరు, చిరునామాను వ్రాసి సమర్పించాలని తెలిపారు. అభ్యర్దులు విధిగా ఒరిజినల్ హాల్ టికెట్, ఒరిజినల్ సర్టిఫికేట్లు

తీసుకురావాలని ఆయన స్పష్టం చేసారు. అభ్యర్ధులు తప్పనిసరిగా తమ సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అప్ లోడ్ చేయని అభ్యర్ధుల పత్రాలు

పరిశీలించుటకు అవకాశం ఉండదని చెప్పారు. అప్ లోడ్ చేసిన పత్రాలతో ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించడం జరుగుతుందని గమనించాలని అన్నారు. పత్రాలు సజావుగా

పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేసామని ప్రశాంతంగా పూర్తి చేయుటకు అభ్యర్ధుల సహకరించాలని అన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధులకు నియామక పత్రాలను అందించుటకు చర్యలు

చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 

మొదటి ప్రాధాన్యతకు అవకాశం : 
    à°’à°•à°Ÿà°¿ కంటే ఎక్కువ పోస్టులకు మెరిట్ జాబితాలో ఉండే అభ్యర్ధులు తాము ఎంపిక చేసుకున్న

మొదటి ప్రాధాన్యతకు ఎంపిక చేసుకుంటే అది తుది నిర్ణయం అన్నారు. మొదటి ప్రాధాన్యత పోస్టులో నియామకం పొందని అభ్యర్ధులు తమ ప్రాధాన్యత ఆధారంగా తరువాత రోజుల్లో

జరిగే ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావచ్చని వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam