DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమ్మి ఓటేస్తే జగన్ నట్టేట ముంచుతున్నాడు : 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు  à°“ట్లేసి గెలిపిస్తే, అన్ని

రంగాల్లోనూ నట్టేట ముంచుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మండిపడ్డారు. నెల్లూరుజిల్లా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో

శనివారం నిర్వహించిన విలేకరుల లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబునాయుడు కన్నా మంచి పాలన అందిస్తాడనే ఒక నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో

ప్రజలు గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ 100రోజుల పాలనలో గ్రామ వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నాడనాయి, అదేవిధంగా గ్రామ సచివాలయం

పోస్టులంటూ పరీక్షలు పెట్టి, వాళ్ళ పార్టీ వారికే పేపర్లు ఇచ్చి మార్కులు వేశారాని అందరికీ తెలిసిపోయిందన్నారు. పేద నిరుద్యోగులు కష్టపడి చదువుకుని పరీక్షలు

వ్రాస్తే, గతంలో తెలంగాణాలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల్లా,  à°ˆà°°à±‹à°œà± సచివాలయ ఉద్యోగాలకోసం పరీక్షలు వ్రాసిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి

ఏర్పడింది.  à°ªà±‡à°ªà°°à±à°²à± తయారు చేసిన విభాగంలో à°’à°• మహిళ, సచివాలయం పరీక్షలు వ్రాసి కేటగిరీ 1లో టాప్ ర్యాంక్ à°—à°¾ నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో 19,50,660 మంది నిరుద్యోగులు

కష్టపడి పరీక్షలు వ్రాస్తే, వాళ్ళ ఆశలు నిరాశలు చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నాడు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ

నీకు బుద్ది చెపుతారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam