DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూర్తి స్థాయిలో కేంద్ర సహాయం అందిస్తాం: కిషన్ రెడ్డి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): అవసరమైతే చట్టాలు à°®à°¾à°°à±à°šà°¿

నూతన పాలసీ తీసుకు à°µà°šà±à°šà°¿ దానిని కఠినంగా అమలు ఇయ్యేలా à°µ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ తూర్పు

గోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం రోడ్ల భవనాల శాఖ అతిది గృహం లో జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ

గోదావరి నది కచ్చులూరు వద్ద జరిగిన బోట్ ప్రమాదం చాలా దురదృష్టకరం అని అన్నారు.ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలపై అధికారులతో

చర్చించామని తెలిపారు. నదిలో బోట్ ప్రయాణాలకు సంబందించి ఒక నూతన పాలసీ తీసుకురావాలని ఏదైనా ప్రమాదం జరిగిన తరువాత కాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకునే విధంగా

పాలసీ రావలసివందని అన్నారు.బోట్లు ప్రయాణానికి సంబందించి ఏదో ఒక శాఖకు భాద్యతలు చేపట్టే విధంగా తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది అన్నారు.కొత్త పాలసీ లో లైసెన్సు

లేని బోట్లు నడిపిన,లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణించిన కఠిన శిక్షలు ఉండేవిధంగా పాలసీ ఉండాలని అన్నారు.లైసెన్సు లేని బోటు నడిపితే ఆ బోటును సీజ్ చేయడం

జరుగుతుందని అన్నారు. తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరగటం వలన చట్టాలలో మార్పులు తప్పవని అన్నారు.ఇటువంటి సమయాలలో కేంద్రం నుండి ఎటువంటి సహాయం కావాలని కోరిన

చేయుటకు సిద్దాంగా ఉన్నామని తెలిపారు.ప్రైవేటు బోట్ల à°ªà±à°°à°¯à°¾à°£à°‚ పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.ప్రమాదం పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక

కూడా ఇవ్వాలని కోరుతున్నామని దాని పై కూడా చర్చించటం జరుగుతుందిని తెలిపారు.ఒక ఎలికాఫ్టర్ ను విశాఖపట్నం ఇటువంటి విపత్తులకు అందుబాటులో ఉండేవిధంగా చూస్తామని

అన్నారు.సహాయ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ బోట్ లో గల్లంతైన వారి

కొరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.బోట్ తీసే విషయంలో నిపుణులతో చర్చిస్తున్నామని గోదావరిలో వరద నీరు పెరిగిందని అన్నారు.కేంద్ర మంత్రి వర్యులు

విపత్తులు సంబందించి విశాఖలో ఎలికాఫ్టర్ సిద్ధం చేస్తామన్నారు,ఐతే రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద స్థలం సిద్ధం చేసి ఇక్కడ ఆ సౌకర్యం ఏర్పాటు చేస్తే

బాగుంటుందని మంత్రికి సూచించారు.కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి.సుబోస్ చంద్ర బోస్,శాసన మండలి సభ్యులు సోము వీరాజు,శాసన సభ్యులు జక్కంపూడి

రాజా,ఏలూరు డి.ఐ.జి-ఏ.కె.ఖాన్,ఏ.పి.ఎస్.పి-ఐ.జి-ఎస్.శ్రీనివాస్, జిల్లా ఎస్.పి-అద్నాన్ నాయీమ్ అస్మి, అర్బన్ ఎస్.పి-షిమోషీ బాజ్ పాయ్, సబ్ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్,

ఎన్.డి.ఆర్.ఎఫ్. కామెండెంట్ జాహిద్ ఖాన్, రెండోవ కమెండెంట్ కులాదీప్ సింగ్, కాకినాడ కోస్ట్ గార్డ్ కంమొండెంట్ ఆర్.రాజకమల్, అసిస్టెంట్ కంమొండెంట్ ఎస్.కె.ఖిదంజి,

సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam