DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువత వివేకానందుని స్ఫూర్తి గా తీసుకోవాలి

పర్యాటక శాఖ మంత్రి à°Žà°‚ శ్రీనివాసరావు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : యువత స్వామి వివేకానందుని స్ఫూర్తిగా

తీసుకొని మూర్తిమత్వాన్ని అభివృద్ధివృద్ధి చేసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం బీచ్ రోడ్డులో గల యూత్

హాస్టల్ లో జరిగిన యువ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకుంటూ తద్వారా కుటుంబ, సమాజ,

దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. భారతదేశం భిన్న సంస్కృతులు, భాషలు, సాంప్రదాయాలు ఉన్న దేశమని అయినా అందరూ కలిసి భరతమాత బిడ్డలు గా మెలుగుతూ ప్రపంచానికే

ఆదర్శంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ ఆచారాలు సంస్కృతులు ఉన్నాయన్నారు. వాటన్నింటి గురించి తెలుసుకొని, వాటిలో ఉన్న మంచిని గ్రహించాలన్నారు.

 

సీఈవో శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన యువత విశాఖ జిల్లాలో గల నాగరికత, చరిత్ర తో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో

జీవన విధానం గురించి ఇక్కడ ఉన్న కళలను గూర్చి, అభివృద్ధి చెందుతున్న విధానం తెలుసుకోవచ్చన్నారు. పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలు పెంపొందించేందుకు ఇటువంటి

యాత్రలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మేనేజర్ రాజేంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బౌద్ధ ఆరామాలు బీచ్ లో పార్కులు గిరిజన ప్రాంతం అరకు అందాలు బొర్రా గుహలు , సింహాచలం

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశాఖ మ్యూజియం విశాఖ డైరీ మొదలైన ఈ చూపించి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి కృష్ణా

జిల్లాలకు చెందిన 200 మంది యువత పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam