DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేవలం ఒక్క గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం 

శ్రీవారి భక్తులకు విశాఖ పర్యాటక శాఖ బంపర్ ఆఫర్ 

విశాఖ నుంచి తిరుపతి 2 రోజుల టూరిజం పేకేజి  

పర్యాటక మంత్రి అవంతి తో టూర్ పేకేజీ

విడుదల 

భక్తులందరూ à°ˆ పేకేజిని సద్వినియోగించుకోవాలి: మంత్రి 

టిటిడి తో టూరిజం శాఖా ఒప్పందం కుదుర్చుకుందా ?

గంటలో శ్రీవారి దర్శనం సాధ్యమైన

పనేనా? మంత్రికి తెలియదా? 

ఇదే జరిగితే ఊహించని రీతిలో స్పందన వచ్చే అవకాశం.?

దీనికి పర్యాటక శాఖా సిద్ధంగా ఉందా? అన్నది అనుమానమే . .. 

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS) : . . . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీనివాసుని భక్తులకు విశాఖ పర్యాటక శాఖా బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఒక్క గంటలోనే తిరుమల

శ్రీవారి దర్శనం  à°šà±‡à°¯à°¿à°¸à±à°¤à°¾à°®à°‚టూ à°’à°• గోల్డెన్ పేకేజీ ని విడుదల చేసింది. రెండు రోజుల విశాఖ - తిరుపతి టూర్ పేకేజిని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస రావు తో విడుదల చేయించింది. పర్యాటక శాఖా మంత్రి ( అవంతి )  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± పర్యాటక శాఖా అధికారులు 
అందిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని శ్రీవారి భక్తులు

అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. అంటే ఈయన కూడా à°ˆ పేకేజీ లో తెలిపిన అంశాలను పూర్తిగా ఆమోదించినట్టు గానే ఉంది.  à°ˆ సందర్బంగా విశాఖ పర్యాటక

శాఖా అధికారులు పాత్రికేయులకు అందించిన ప్రెస్ రిలీజ్ లో à°ˆ ప్యాకేజి gurinchi అందించిన విషయాల ప్రకారం 

వైజాగ్ - తిరుపతి  - 2 రోజుల పేకేజీ : . . .

ఈ పేకేజిలో భాగంగా

ప్రతి బుధ వారం, శుక్ర వారం, ఆదివారం (మొదటి రోజు)  
మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ లో తిరుపతి à°•à°¿ బయలు దేరుతుంది తిరిగి మూడవ రోజు ఉదయం 8 :30  à°—ంటలకు విశాఖ చేరుతుంది. టికెట్ ధర

పెద్దలకు రూ. :4000., పిల్లలకు రూ. :3700.   

డే 1 : విశాఖపట్నం నుంచి తిరుపతి à°•à°¿ బయలు దేరుట. 
డే 2 : మరునాటి ఉదయం  à°•à°¾à°³à°¹à°¸à±à°¤à°¿ లో విశ్రాంతి, అల్పాహారం. 
         à°¤à°¦à±à°ªà°°à°¿ తిరుమల

దర్శనం కొరకు బయలు దేరుట. 
         à°¤à°¿à°°à±à°®à°² చేరుట, ఒక్క à°—à°‚à°Ÿ లో శ్రీవారి దర్శనం. 
         à°µà±†à°‚టనే తిరుపతి కు వెనుదిరుగుట, స్థానిక ఆలయాల సందర్శన,
         à°­à±‹à°œà°¨ విరామం

తిరుపతి లో. 
         à°¶à±à°°à±€ కాళహస్తి à°•à°¿ చేరుకొనుట.
         à°¶à±à°°à±€à°•à°¾à°³à°¹à°¸à±à°¤à°¿ లో ఆలయ దర్శనం.
         à°µà°¿à°¶à°¾à°– పట్నం కు తిరిగి బయలు దేరుట. 
డే  3 : ఉదయం విశాఖ చేరుట.        


/> తిరుమల శ్రీనివాసుని దర్శనాన్ని వైకుంఠం క్యూ లైన్లలో à°—à°‚à°Ÿà°² తరబడి వేచి యుండాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం  à°’క్క à°—à°‚à°Ÿ లోనే  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±à°¨à°¿

దర్శనం చేయించేందుకు విశాఖ పర్యాటక శాఖా ముందుకు రావడం అందరికీ ఆనందాన్ని కల్గిస్తోంది. వివిఐపి లు కూడా ఈ సమయం లోపలే దర్శనం చేసుకునే అవకాశం అంతంత

మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఒక్క గంటలో స్వామి దర్శనాన్ని పర్యాటక శాఖా ఎలా చేయించగలదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. 

పైగా టోకెన్ల విధానం అమలు లో ఉండగా

వీళ్ళు ఏ మార్గంలో దర్శనం చేయించగలరు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

వీళ్ళు చెప్పిన విధంగా ఒక్క గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం చేయించగలిగితే తిరుమల

వెళ్లే భక్తుల్లో 90 శాతం మంది à°ˆ పేకేజీ వైపే మ్రుగ్గు చూపుతారు. à°…à°‚à°¤ పెద్ద సంఖ్యలో భక్తులు à°ˆ విశాఖ - తిరుపతి పేకేజీ à°•à°¿ టికెట్లు  à°¬à±à°•à± చేసుకుంటే విశాఖ పర్యాటక

శాఖా బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉందా అన్నది అనుమానమే.  à°ˆ ఒక్క పేకేజిని సరిగ్గా చెప్పినట్టు నడపగలిగితే పర్యాటక శాఖా ఖజానా మొత్తం à°ˆ పేకేజీ తో నే

నిండిపోతుంది అన్నది అక్షర సత్యం. మరో ప్రక్క తిరుపతి వెళ్లే రైళ్లల్లో సీట్లు కూడా మిగిలి పోయే అవకాశం ఉంది. 

టిటిడి తో ప్రత్యేక ఒప్పందం కుదిరిందా ?. ..

రాష్ట్ర పర్యాటక శాఖా కు తిరుమల తిరుపతి దేవస్థానములు ( టిటిడి) కి మధ్య ఈ విధమైన ప్రత్యేక ఒప్పందం ఏదైనా కుదిరిందా అనే విషయం రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస రావే చెప్పాల్సి ఉంది. అసలు తిరుమల ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క గంటలో శ్రీనివాసుని దర్శనం చేయించగలం అనే మాట ఎంతవరకూ సబబుగా ఉందొ సదరు

మంత్రి వివరించాల్సియుంది. అయితే ఐఆర్ సీటీసీ టూరిజం సంస్థ ఇదే తరహా పేకేజీ ని నడుపుతోంది, ఈ సంస్థ టిటిడి తో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ద్వారా వచ్చే పర్యాటకులకు

రూ. 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. అదే తరహాలో విశాఖ పర్యాటక శాఖా కూడా ఉందేమో అని DNS  à°µà°¿à°¶à°¾à°– జిల్లా పర్యాటక శాఖాధికారిని ప్రశ్నించింది. అలాంటిదేమీ

లేదనే జవాబు వచ్చింది.   

పేకేజి ఏంటో తెలియకుండానే మంత్రి విడుదలా ?: . .. 

అసలు విశాఖ - తిరుపతి పేకేజీ లో ఏమి చేర్చారో, ఏమి హామీలు ఇచ్చారో చదవకుండానే, అసలు

విషయం తెలియకుండానే పర్యాటక శాఖా మంత్రి ఈ పేకేజీ ని విడుదలా చేసినట్టు తెలుస్తోంది. ఆయన సొంత పర్యాటక శాఖలో అమలు అవుతున్న పేకేజిలు ఏంటో కూడా తెలియకుండానే

పత్రికా సమావేశంలో పేకేజీ ని ఆదరించండి అని పిలుపు ఇవ్వడం చూస్తుంటే పర్యాటక శాఖా పరిస్థితి ఏంటో తెలుస్తోంది. మీడియా సమావేశంలో మాట్లాడడానికి ముందే ఈ

పేకేజిల గురించి తెలుసుకోవాల్సిన మంత్రి ఎప్పడికప్పుడు తూతూ మంత్రంగా చదవడం చూస్తుంటే శాఖా లోని లోటుపాట్లు స్పష్టమవుతున్నాయి.  

ఒక గంట నుంచి మూడు,

నాలుగు గంటల సమయం అని ముద్రించి ఉంటె రూ.300 ద్వారా శ్రీవారి దర్శనం చేయించే ఏర్పాటు చేస్తున్నారు అని అందరికీ తెలుస్తుంది. తిరుమల లో దర్శన వేళలు ఏ రోజు కు ఆ రోజే

మారిపోతూ ఉంటాయి. అలాంటిది కేవలం ఒక్క గంటలో దర్శనం చేయిస్తాం అంటూ ప్రకటిస్తే భక్తులు అతిగా ఆశ పడడం ఖాయం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam