DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో బీజేపీ యే ప్రత్యామ్నాయం:  మాజీ మంత్రి రావెల

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజలు విముఖత తో ఉన్నారని భారతీయ జనతా

పార్టీ ప్రత్యామ్నాయం గా మారుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ103 జయంతి సందర్భంగా తూర్పు గోదావరి

జిల్లా  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ శాంతినగర్ లోని పైడా వెంకట నారాయణ స్వగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంఅభివృద్ధి పథంలో

పయనిస్తోందన్నారు. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ బిల్, పెద్ద నోట్ల రద్దు,ఆర్టికల్370రద్దు సాహసోపేత నిర్ణయమన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ

సహకారం తో వేల కోట్ల రూపాయలు పొంది నిధుల దుర్వినియోగం చేసిందన్నారు.టిడిపి అవినీతి, మోడీ వ్యతిరేక విధానాలను నీరసించి ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారన్నారు.

టిడిపి అవినీతి పై వైసీపీ ప్రభుత్వం సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవడం లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని

తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, నగర అధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, నాయకులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాంబాల

వెంకటేశ్వరరావు, పైడా వెంకట నారాయణ, కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam