DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల మానిఫెస్టోలని రిజిస్ట్రేషన్ చేసే దమ్ము ఉందా ? హామీలు తప్పితే జైలుకే పంపాలి

ఎన్నికల మానిఫెస్టోలని రిజిస్ట్రేషన్ చేసే దమ్ము ఉందా ?  

హామీలు తప్పితే నేరుగా  à°œà±ˆà°²à±à°•à±‡ పంపాలి 

విశాఖపట్నం, జూన్  :  à°ªà±à°°à°¤à±€ ఐదేళ్ల కో సారి వెర్రి

వెంగళాయ్ లు  à°…వుతున్న ప్రజలను కాపాడవలసిన భాద్యత à°ˆ దేశ ఎన్నికల కమిషన్ పై ఉంది. పాత పార్టీ నుంచి, ఇప్పుడే పుట్టిన పార్టీ వరకూ ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు చేస్తూ

ప్రజల మతి చెడగొట్టి, అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియని స్థితి తీసుకువస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం ఎన్నికల సమయాల్లో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న

వాగ్దానాలు, అసంబద్ధ హామీలతో కూడిన కరదీపిక ( పామ్ ప్లేట్ ) లను విడుదల చేస్తున్నాయి. వీటన్నింటినీ నిజమేననుకుని ప్రజలు ఎక్కువ హామీలు ప్రకటించిన పార్టీలకే అందలం

ఎక్కిస్తున్నారు. తీరా అధికారం లోకి వచ్చాక ఈ పామ్ ప్లేట్లన్నీ చెత్తబుట్టలోకే వెళ్తున్నాయి. హామీలు ఇచ్చిన వాడూ మరిచిపోతున్నాడు, విని ఓటు వేసినవాడూ

మరిచిపోతున్నాడు.
దీనికి ప్రధాన నిదర్శనమే నేటి విభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. విభజన వద్దు అని పోరాటం చేసినా ఫలితం లేక అడ్డగోలుగా విభజించాయి నాటి అధికార

కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు. అయితే ఈ క్రమం లోనే ఈ దేశం లోని అన్ని రాజకీయ పార్టీలు ( సీపీఎం తప్ప) ఈ పాపం లో పాలుపంచుకున్నాయి. 90 శాతం చచ్చిన ఆంధ్ర ప్రదేశ్

ని ఇంకా చంపేందుకా అన్నట్టు à°—à°¾ విభజనలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లు కూటమి à°—à°¾ తయారై  à°‡à°¬à±à°¬à°¡à°¿ ముబ్బడి à°—à°¾ ఎవడికి తోచిన హామీలు వాళ్ళు

ఇచ్చేసి ఆరు కోట్ల ఆంధ్రులను తమ మాయా జాలం లో ముంచేశారు. ప్రధానం గా వీళ్ళు ఇచ్చిన హామీల్లో 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, లాంటివి బీజేపీ

హామీ ఇవ్వగా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి రెండు వేలు ప్రతి నెలా, ప్రతీ కుటుంబానికి ఒక ఇల్లు, వివిధ కార్పొరేషన్లకు కనీసం రూ. 500 కోట్లు ఇలా ఇబ్బడి ముబ్బడి గా

హామీలు ఇచ్ఛేసారు. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేసే ఉద్ద్యేసాలు అయితే వీరిద్దరికీ ఉన్నట్టు లేదు ( అప్పడికే కాదు ఇప్పడికి కూడానూ). వీరిద్దరూ నాలుగేళ్లు

సంసారం చేసిన తర్వాత ఇద్దరికీ అభిప్రాయం భేదాలు రావడం తో ఎవరి దారి వారిది అని విడిపోయి, ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచారు. అయితే అతి త్వరలో మరో మారు ఎన్నికలు

రానున్నందున, మరో సారి ప్రజల ముందు గారడీ చేసి తమ ఇంద్రజాలాన్ని ప్రదర్శించేందుకు సరికొత్త తాయిలాలు బయటకు తీస్తున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు

అన్నట్టుగా ఇరు పార్టీల నేతలూ ఎవరికీ అందినట్టు వాళ్ళు అనుభవించేసి. ఇప్పుడు ప్రజల ముందు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టు గా ఆషాఢభూతి వేషాల్లో

నటించేస్తున్నారు. 
à°ˆ విధమైన మోసాలకు పాల్పడకుండా, ప్రజలను మోసం చెయ్యకుండా ఉండాలి అంటే. . ..  à°Žà°¨à±à°¨à°¿à°•à°² కమిషన్ అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్నికల్లో పోటీ చేసే ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పేర్లు నమోదు చేయించుకోవాల్సియుంటుంది. అదే సమయంలో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆర్ధిక

లావాదేవీలను తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కు అందించాలి. అదే సమయం లో ఏ రాజకీయ పార్టీ తాము ప్రచారం చేసే ప్రతీ హామీ ని ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాలి,

దీన్ని చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి అని నిబంధన పెట్టాలి. గెలిచినా రాజకీయ పార్టీ తాము ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మేనిఫెస్టో ని తప్పని సరిగా అమలు

చెయ్యాలి అని నిబంధన పెట్టాలి, ఆలా చెయ్యని పార్టీల ప్రతినిధులకు జైలు శిక్ష నేరుగా వేయించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక చట్టం తీసుకు

రావాలి. 

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ రాజకీయ పార్టీ, నేతలకు చట్టం అంటే భయం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భయం లేకపోవడం వల్లనే తమకు తోచిన హామీలను ఇచ్చి

ప్రజలను మభ్య పెట్టి  à°¤à°® పబ్బం గడుపుకుంటున్నారు.  à°’à°• సారి మేనిఫెస్టో అమలు చెయ్యడం విఫలం అయ్యిన రాజకీయ పార్టీ, నేతలు ( వ్యక్తిగతంగా) ను శాశ్వతంగా రాజకీయాల్లో

పోటీ చెయ్యకుండా చట్టం తక్షణం అమలు లోకి తేవాలి. అప్పుడే రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎన్నికల హామీలు ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షం లో ఎన్ని

యుగాలైనా à°ˆ భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంటుంది తప్ప, ఎప్పడికీ అభివృద్ధి చెందిన దేశం à°—à°¾ మారదు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam