DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి పధంలో కాకినాడ టౌన్ బ్యాంకు: రవీంద్ర 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°°à±‚ 7.48 కోట్ల  à°²à°¾à°­à°¾à°²à°¤à±‹ ది కాకినాడ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంకు అభివృద్ధి

పధంలో పయనిస్తోందని బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ జయ రెసిడెన్సీ హోటల్లో బ్యాంకు 40 à°µ వార్షిక నివేదిక వివరాలు

తెలియ చేసారు. 1980 సంవత్సరంలో ప్రారంభమైన టౌన్ బ్యాంకు, 18 బ్రాంచ్ లు ఏర్పాటు చేసుకుని, ప్రతి సంవత్సరం అభివృద్ధి పథంలో పయానిస్తోందని తెలిపారు. పూర్తి కంప్యూటరికరణ ,

కోర్ బ్యాకింగ్ ప్రతి బ్రాంచ్ లో ఏర్పాటు చేసామన్నారు. ఈ సంవత్సరం ఆడిట్ లో 'ఏ' గ్రేడ్ సాధించిందని, రిజర్వుబ్యాంకు నిబంధనలు ప్రకారం ది.31-03-2019 నాటికి డిపాజిట్లలో 19.25

శాతం యస్.యల్. ఆర్యన్.డి. టి.యల్ పై సి ఆర్ ఆర్ 4శాతం నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం పెట్టుబడులు రూ 249.28 కోట్లు కాగా, ప్రభుత్వ సెక్యూరిటిలలో రూ 153.22 కోట్లు, షెడ్యూల్

బ్యాంకులలో రూ83.97 కోట్లు, ఇతరములకు రూ 12.21 కోట్లు పెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ, ఆదాయ పన్నులు చెల్లించిన తర్వాత బ్యాంకు నికరలాభం

రూ 7.48 కోట్లుగ వుందన్నారు. బ్యాంకు సభ్యుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిపులు రూ 1,35,000 ఇవ్వడం జరిగిందని, శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్ని, ఋణ

గ్రహీతలకు భీమా చేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో వచ్చిన తుఫాను బాధితులకు రూ 8,00,000లు ముఖ్యమంత్రి సహయనిధికి ఇవ్వడం జరిగిందని, విశాఖ, విజయనగరం,

శ్రీకాకుళం, విజయవాడలో నాలుగు బ్రాంచీల ఏర్పాటు కొరకు రిజర్వుబ్యాంకు అనుమతి కొరకు ప్రయత్నిస్తున్నామని రవీంద్ర తెలిపారు. ఈ సమావేశంలో తోట సుధీర్, గొడితి

వెంకట కృష్ణమూర్తి, మదాని మొహీధ్ధీన్ ఖాన్, కంటిపూడి సత్యనారాయణ, విశ్వనాధం భాస్కర రామ శర్మ, సత్తి రామరెడ్డి, పి.వెంకటేశ్వరరావు, సి.సుగుణరావు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam