DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో పట్టు దిగుమతి అవసరం రాకుండా చేస్తాం. .. 

రూ. 1.23 కోట్ల బకాయిల చెల్లింపులకు చర్యలు: మంత్రి కన్నబాబు 

రైతు భరోసా పధకం తో ఒక్కొక్కరికీ  à°à°Ÿà°¾ రూ. 12 ,500 చెల్లింపులు 

జిల్లాలో 2300 ఎకరాల్లో మలబరి సాగు

ఉంది : కలెక్టర్ మురళీధర్ రెడ్డి  

(DNS రిపోర్ట్: పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు పూర్తి

సహకారం ఇచ్చి మేలైన పట్టు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు

మండలం చేబ్రోలు లో ఏర్పాటు చేసిన పట్టు రీలర్లు, పట్టు రైతుల సమ్మేళనం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక వనరులు ఉన్నాయన్నారు.

ఇంతవరకు అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మాత్రమే పరిమితమైన పట్టు పరిశ్రమ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు. ఈ పరిశ్రమలో కౌలు రైతులు కూడా

ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ పరిశ్రమ ద్వారా రైతులకు నెలసరి ఆదాయం కూడా వస్తుందని, భవిష్యత్తు లో పట్టును చైనా, బెంగుళూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవలసిన

అవసరం కూడా ఉండదన్నారు. రాష్ట్రంలో మలబరి తోటల పెంపకాన్ని ఉపాధి హామీ పధకం ద్వారా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పట్టు పరిశ్రమ పట్టు

తప్పిపోకూడదనే ఉద్దేశ్యంతో పట్టు రైతులకు రావాల్సిన రూ. 1 .23  à°•à±‹à°Ÿà±à°² రాయితీ బకాయిలను త్వరలో విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. చేబ్రోలు

లో రూ.  15 లక్షల  à°µà±à°¯à°¯à°‚తో పట్టు శిక్షణ కేంద్రాన్ని,  à°°à±‚. 50 లక్షల తో వ్యయంతో షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలియచేసారు. రాష్ట్రంలో రైతు

భరోసా పధకం క్రింద ప్రతి ఏటా రూ. 12 ,500 నాలుగు సంవత్సరాల పాటు రైతులకు అందిస్తామన్నారు. అదే విధంగా రైతుల బీమా పధకం క్రింద మొత్తం ప్రీమియం ప్రభుత్వమే

చెల్లిస్తుందన్నారు. రైతులకు వడ్డీలేని రుణాల కోసం 2 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 

కార్యక్రమం లో పాల్గొన్న  à°¸à±†à°‚ట్రల్ సిల్క్ బోర్డు, మెంబర్

సెక్రటరీ రజిత్ రంజాన్ ఒకండియార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యత గల పట్టు ఉత్పత్తి జరుగుతుందని, ఈ పట్టుని ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఎగుమతి చేసేందుకు చర్యలు

తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు మూలంగా పట్టు దిగుమతి తగ్గుతుందన్నారు, సెరికల్చర్ సహాయకులను ప్రభుత్వం నియమించడం అభినందనీయమన్నారు.

చేబ్రోలు లో ఏర్పాటు చేసిన పట్టు ఆటోమాటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ ద్వారా 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.

మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2300 ఎకరాల్లో మలబరి సాగు జరుగుతుందని, ఇటీవల చింతూరు లో ఏర్పాటు చేసిన టసరి సిల్క్ ద్వారా గిరిజన రైతులు ప్రయోజనం

పొందుతున్నారన్నారు. 

రాష్ట్ర సెరికల్చర్, హార్టికల్చర్ శాఖల కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ పట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానంలో

ఉందన్నారు. రాష్ట్రంలో 400 మంది సెరికల్చర్ సహాయకుల నియామకం జరుగుతుందన్నారు. 

కార్యక్రమం లో సెరికల్చర్ బోర్డు డైరక్టర్ సుభాష్ నాయక్,  à°ªà°¿à° à°¾à°ªà±à°°à°‚ శాసన

సభ్యులు పెండెం దొరబాబు, మాజీ మంత్రి కె. రామమోహన్ రావు, డిప్యూటీ డైరక్టర్ పిఎంయు రామరాజు లతో పాటు, శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam