DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభ్యర్ధులు ఏంటీసిడెంట్ పత్రం సమర్పించాలి:  కలెక్టర్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°—్రామ, వార్డు సచివాలయ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలనలో

అభ్యర్ధులు విధిగా ఏంటీసిడెంట్ పత్రం సమర్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల ప్రక్రియను స్వయంగా పరిశీలిస్తున్న

జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లా పరిషత్ కార్యాలయంలో పలువురు మీడియా ప్రతినిధులకు వివరాలను బుధ వారం తెలిపారు. గ్రామ సచివాలయం వెబ్ సైట్ లో  à°à°‚టీసిడెంట్ పత్రం డౌన్

లోడ్ చేసుకుని పరిశీలన సమయంలో విధిగా సమర్పించాలని స్పష్టం చేసారు. ధృవపత్రాల పరిశీలనకు వచ్చేటపుడు తమ సర్టిఫికేట్లను ఆన్ లైన లో అప్ లోడ్ చేసి హాజరు కావాలని

అన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్ధులకు ఎస్.à°Žà°‚.ఎస్, à°‡- మెయిల్ ద్వారా సమాచారం అందిస్తూ srikakulam.ap.gov.in వెబ్ సైట్ లోను పొందుపరచడం జరుగుతోందని తెలిపారు. 
ఇప్పటి

వరకు 2,419 మందికి కాల్ లెటర్స్ జారీ చేయగా 2,337 మంది డౌన లోడ్ చేసుకున్నారని వివరించారు. వ్యవసాయ సహాయకుల పోస్టులకు 550 మందికి, ఉద్యానవ సహాయకులకు 121 మందికి, మత్స్య సహాయకులకు 58

మందికి, డిజిటల్ అసిస్టెంట్లకు 365 మందికి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్ మెంటు కార్యదర్శికి 77 మందికి, వార్డు ప్లానింగు, రెగ్యులేషన్ కార్యదర్శికి 66 మందికి,

పశుసంవర్ధక సహాయకులకు 214 మందికి, వార్డు విద్యా, డేటా ప్రాసెసింగు కార్యదర్శికి 91 మందికి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శికి 87 మందికి, సెరీకల్చర్ సహాయకులకు

ఒకరికి, ఇంజినీరింగు సహాయకులకు 714 మందికి, వార్డు ఎమెనిటీస్ కార్యదర్శికి 75 మందికి కాల్ లెటర్స్ పంపించామని వివరించారు. బుధ వారం రాత్రికి పంచాయతీ కార్యదర్శులు,

వార్డు కార్యదర్శులు, మహిళా పోలీసు పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్స్ జారీ చేయుటకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కాల్ లెటర్స్ అందుకున్న

ప్రతి ఒక్కరూ అప్ లోడ్ చేయాలని అన్నారు. ధృవపత్రాల పరిశీలన సమయంలో అప్ లోడ్ చేసిన పత్రాలను డౌన్ లోడ్ చేసి సమర్పించాలని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన డౌన్

లోడ్ కావడం లేదని తెలిసిందని అటువంటివారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.

 à°§à±ƒà°µà°ªà°¤à±à°°à°¾à°² పరిశీలన బుధ వారం ప్రారంభం అయిందని

పేర్కొంటూ ఈ ప్రక్రియ అవసరమైతే 29వ తేదీ వరకు పొడిగిస్తామని స్పష్టం చేసారు. అభ్యర్ధులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ముందుగా

ప్రకటించిన విధంగానే మూడు కళాశాలల్లో ధృవపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు.

శివాని ఇంజనీరింగు కళాశాలలో – పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు,

వి.ఆర్.ఓలు, ఏ.ఎన్.ఎం,

                                        పశుసంవర్ధక అసిస్టెంట్ల పరిశీలన

శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో – గ్రామ సర్వేయర్, విద్య- సంక్షేమ

సహాయకులు, అన్ని మునిసిపాలిటీల వార్డు సచివాలయానికి చెందిన అన్ని పోస్టులకు పరిశీలన 

గాయత్రి డిగ్రీ కళాశాలలో – మత్స్యశాఖ, సెరీకల్చర్, వ్యవసాయ, ఉద్యానవన

అసిస్టెంట్ల పోస్టులు, మహిళా ప్రొటెక్షన్ అధికారి, ఇంజనీరింగు అసిస్టెంట్ల పోస్టులకు పరిశీలన ఉంటుందని కలెక్టర్ వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam