DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూన్ 2 . . పాలకుల స్వార్ధానికి బలిపీఠం . . . . .

కొందరికి మోదం, ,  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మందికి ఖేదం....

అన్నీ కోల్పోయిన ఆంధ్రులకు అవమానమే ఇది 

విశాఖపట్నం, జూన్ 02, 2018 (DNS Online)   : అడ్డగోలు à°—à°¾ రాష్ట్రాన్ని విభజన జరిపిన

పాపం ఈ దేశం లోని అన్ని రాజకీయ పార్టీలదే.( ఒక్క సీపీఎం తప్ప ). తెలంగాణా విడగొడితే ఓట్లు కొల్లగొట్టవచ్చు అనే అధికార దాహంతో నాడు అధికారం లో ఉన్న కాంగ్రెస్,

ప్రతిపక్షం లో భారతీయ జనతా పార్టీ పార్టీలు చేసిన బహిరంగ కుట్ర కు నిదర్శనమే అథ పాతాళం లోకి చేరుకున్న విభక్త ఆంధ్ర ప్రదేశ్. దీనిలో పాపం ఏ ఒక్క పార్టీ కో

అంటగడితే అంత తప్పు ఇంకొకటి ఉండదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే పదేళ్ల పాటు ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం, ఎలాగైనా సరే రాష్ట్రం లో , అధికారానికి రావాలి

అనే కుట్ర తో రెండు కళ్ళ సిద్ధాంతం అని ప్రచారం చేసి, అటు తెలంగాణా వారిని, ఇటు ఆంధ్ర వారిని కూడా మోసగించింది. కొంత తెలివైన మేధావులు ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ

ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, పార్టీని దాదాపుగా భూస్థాపితం చేసేసారు.  à°…యితే కులాల కుంపటిలో కుళ్ళి పోతున్న ఆంధ్ర లో మాత్రం ప్రజలు à°† సాహసం చెయ్యలేక

పోయారు. 

రోజు వారీ కూలీ చేసుకునే వారి నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అన్ని స్థాయిల వారూ రోడ్డెక్కి తమ జీవితాలను పణంగా పెట్టి మరీ ఉద్యమిస్తే రాజకీయ

పార్టీలు చేసిన ద్రోహానికి అందరూ బలయ్యారు, అయినప్పటికీ ఎంతో ఓర్పుతో తిరిగి శ్రమించి నిలబడదాం అనుకునే సరికి రాజకీయ పార్టీలు ఓట్లు కోసం ద్వంద వైఖరి తో రెండు

కళ్ళ సిద్ధాంతం అంటూ విభజనకి అంగీకరిస్తూ దాదాపు ఆరు ఏళ్ల క్రితమే కేంద్రానికి లేఖలు పంపడం తో ఈ ద్రోహానికి బలం చేకూరింది. కేవలం రాజకీయ పరంగా తీసుకున్న విభజన

లో అసలు బిల్లు లో ఏముందో తెలియకుండానే పార్లమెంట్ లో విభజనకి అనుకూలంగా ఓటు వేసారా ? అంటే తెలిసి ఉండి అంతా దొంగ నాటకాలాడారని తెలుస్తోంది. వీరికి తగిన బుద్ది

చెప్పనంత కాలం ఆంధ్ర ప్రజల బ్రతుకులు బాగుపడేది కల్లే. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam