DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచే అట్టహాసంగా ఉదయ్ పట్టాలెక్కేసింది. . . .

విశాఖ రైల్వే జోన్ మోడీ పుణ్యమే. .. 

విశాఖ జోన్ తో పాటు డివిజన్ కూడా ఉంటుంది. . 

అరకు రైలు కు మరో 5 విస్టాడోమ్ కోచ్ లు ఇచ్చాం . 

రైల్వే సహాయ మంత్రి

సురేష్ à°…à°‚à°—à°¡à°¿. .. 

దేశంలోనే రెండవది à°ˆ ఉదయ్ రైలు 

రైలు కు మొదటి రోజే మంచి భారీ స్పందన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2019

(డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ తో పాటు అత్యంత ప్రాధాన్యత కల్గిన విశాఖ డివిజన్ కూడా కొనసాగుతుందని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్

చెన్న బసప్ప అంగడి ప్రకటించారు. గురువారం విశాఖ పట్నం రైల్వే స్టేషన్ లో జరిగిన ఉదయ్ ఎక్స్ ప్రెస్ డబుల్ డెక్కర్ రైలు ను ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉదయం వేళల్లో అందుబాటులో ఉన్నరైళ్లు అత్యంత రద్దీగా ఉండడంతో అందరికీ అనువుగా ఉండే విధంగా ఉదయ్

ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.  à°µà°¿à°¶à°¾à°– పట్నం - విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ రైలు దేశంలోనే రెండవడిగా తెలిపారు. కోయంబత్తూర్ - బెంగుళూరు మధ్య

à°’à°•à°Ÿà°¿ ఇంతకూ ముందు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.  à°•à±‡à°µà°²à°‚ అతి తక్కువ స్టాప్ లతో విజయవాడ చేరుతుందని, తిరిగి సాయంత్రం విజయవాడ లో బయలుదేరి రాత్రికి విశాఖ

చేరుతుందన్నారు. 

విశాఖ రైల్వే జోన్ మోడీ పుణ్యమే.:  . .:

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నాటి కాంగ్రెస్ పాలకులు,

విశాఖ ప్రాంతానికి కనీసం విలువ ఇవ్వకుండా. . ఇక్కడ నుంచి బయలు దేరే రైళ్లను కూడా ఒరిస్సా, కొలకత్తా కు తరలించుకు పోయారన్నారు. విశాఖ డిమాండ్ నేపథ్యంలో భారత

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ ప్రకారం మొన్న ఎన్నికల ముందే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించడమే కాకుండా, తక్షణమే జోన్ ఏర్పాటుకు

ప్రత్యేక అధికారిని కూడా నియమించారన్నారు. ఇది పూర్తిగా మోడీ పుణ్యమేనన్నారు. 
ఇక ఎం తో ప్రాధాన్యత కల్గిన విశాఖ రైల్వే డివిజన్ ను కూడా కొనసాగించేందుకు

స్థానిక ప్రతినిధులు , పార్టీలు, ప్రజలు, ఉద్యోగుల నుంచి డిమాండ్లు ఉన్నందున, దీన్ని కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

అరకు రైలు కు

మరో 5 విస్టాడోమ్ కోచ్ లు : . . .

దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కల్గిన అరకు ప్రాంత అందాన్ని చూసేందుకు విశాఖ నుంచి ప్రతి రోజూ వేలాది మంది పర్యాటకులు రైల్లో

వెళ్తుంటారన్నారు. విశాఖ - కిరండూల్ రైలు లో నుంచే ప్రకృతి ని నేరుగా వీక్షించేందుకు à°ˆ రైలు à°’à°• à°µà°¿à°¸à±à°Ÿà°¾à°¡à±‹à°®à± ( అద్దాల కోచ్) ను నడుపుతున్నామన్నారు. దీనికి డిమాండ్

ఎక్కువగా ఉన్నందున అదనంగా మరో ఐదు వీస్తోడోమ్ కోచ్ లను అందిస్తున్నామని కేంద్ర మంత్రి అంగడి తెలిపారు. దీని గురించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పడికే విశాఖ

డివిజనల్ రైల్వే మేనేజర్ కు లేఖలు అందాయన్నారు. అతి త్వరలోనే అవి విశాఖ చేరనున్నట్టు తెలిపారు. 

విశాఖను పర్యాటకంగా వృద్ధి పరుస్తాం : . . . .

భారత ప్రధాని

నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విశాఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఒక ప్రక్క మహా సముద్రం, మరో ప్రక్క కొండలు, ఆధ్యాత్మిక

కేంద్రాలు, ఆహ్లాదకరమైన అరకు అందమైన వాతావరణం, ఏజెన్సీ ప్రాంతాలు ఎం తో ప్రాధాన్యత కల్గి ఉన్నందున ప్రధాని ఈ ప్రాంతాన్ని ఎంపికచేశారన్నారు. ఇంత ఆహ్లాదకరమైన

ప్రాంతాన్ని వీక్షించేందుకు తనకు అవకాశం కల్పించిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కు అయన ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కారక్రమం లో విశాఖ ఎంపీ ఎంవివి

సత్యనారాయణ, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, నర్సాపురం ఎంపీ రాజు, ఎమ్మెల్సీ లు పివిఎన్ మాధవ్, వర్మ, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ రైల్వే డివిజనల్ మేనేజర్

శ్రీవాత్సవ్, ఇతర ఉన్నతాధికారులు, భారతీయ జనతా పార్టీ నేతలు, రైల్వే సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
అనంతరం రైల్వే సహాయ మంత్రి జండా ఊపి ఉదయ్ రైలు ను

ప్రారంభించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam