DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హత గల ప్రతి రైతుకు "రైతు భరోసా" అందాలి

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాలు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలో అర్హత గల ప్రతి సాగు రైతుకు వైఎస్ఆర్ రైతు భరోసా అందేలా చూడాలని జిల్లా కలెక్టరు వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలోని ఆర్ డి వో

లు, తాసిల్దార్ లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఈ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిజనిర్ధారణ క్షుణ్ణంగా

చేయాలన్నారు. అక్టోబర్ 15న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తారని, రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సన్న,

చిన్న కారు సాగు రైతుకు రూ.12, 500 అందజేస్తారని తెలిపారు.ఈ పథకం పట్ల అందరికీ పూర్తి అవగాహన కలిగే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ పథకం మూలంగా భూమి యజమానికి

ఎటువంటి హాని ఉండదని, పంట రుణాల పై, భూమి యజమాని రుణాలపై కూడా ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం గనుక లబ్ధిదారుల

గుర్తింపులో ప్రజా ప్రతినిధులను సమన్వయ పరచుకుంటూ అర్హులైన పట్టాదారు లకు పంట సాగు హక్కు పత్రం సిసిఆర్సీ గల వారందరికీ ఈ పథకం లో లబ్ధి చేకూరాలన్నారు. దీనికి

సంబంధించిన నిర్ణీత ప్రొఫార్మా ల్లో లబ్ధిదారుల జాబితాను 28వ తేదీ నాటి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 15 న పథకం ప్రారంభం అవుతుంది కాబట్టి 11వ తేదీ

నాటికే పనులన్నీ పూర్తి కావాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుపై సాగు రైతు, భూమి యజమాని సంతకం చేయవలసి ఉంటుంది అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ హక్కు చట్టం (ఆర్ ఓ ఎఫ్

ఆర్) పట్టా ద్వారా సాగు చేసుకుంటున్న వారికి, దేవాదాయ, ఇనాం భూములు సాగు రైతులకు కూడా ఇది వర్తిస్తుంది అన్నారు. అయితే ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు

మాత్రం వర్తించదని వెల్లడించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభలో ప్రదర్శించాలన్నారు. ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ సాగు రైతులతో పాటు భూమి యజమాని పేరు కూడా

జాబితాలో ఉండాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జీవీఎంసీ కమిషనర్ డా. జి. సృజన, జెసి 2 ఎన్ వి సూర్యకళ, డి ఆర్ వో ఎం. శ్రీదేవి, వ్యవసాయ

శాఖ ఉపసంచాలకులు బి.మోహన్ రావు, అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డ్వామా పీడీ సందీప్, ఎస్ డి సి లు, రంగయ్య అనిత,

శ్రీనివాసమూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam