DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉదయ్ ఎక్స్ ప్రెస్:  ఒకే రైలు రెండు సార్లు ప్రారంభం 

ఉదయ్ ఎక్స్ ప్రెస్ అన్నీ రెండు సార్లే. . . ప్రత్యేకం

విశాఖ లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి ప్రారంభం.   

అదే రైలు లో  à°—ూడెం వెళ్లిన ఎంపీ అక్కడ

ఓపెనింగ్ 

రెండు సార్లు ముహూర్తం - రెండు సార్లు జండా ఊగింది. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం - విజయవాడ

మధ్య నడుస్తున్న ఉదయ్ ఎక్స్ ప్రెస్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు అన్నీ ప్రత్యేకతలే.  à°ˆ రైలు ను గురువారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం లో జండా ఊపి ప్రారంభించారు. à°ˆ రైలు

ప్రారంభోత్సవానికి విశిష్ట అతిధిగా పాల్గొన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ్ణరాజు అదే రైలులో ప్రయాణించి తాడేపల్లి గూడెం చేరుకున్నారు. అక్కడ స్థానిక నేతలు

ఇదే రైలును మరోసారి జండా ఊపి ప్రారంభించే ప్రయత్నం చేసారు. దీనికి ముఖ్య అతిధిగా ఇదే రైలు లో ప్రయాణించి అక్కడే దిగిన ఎంపీ రఘురామకృష్ణం రాజు ను ఆహ్వానించారు.

తాను 250 కిలోమీటర్లు దూరం ప్రయాణించి వచ్చిన అదే రైలును అయన మళ్ళీ రెండో సారి జండా ఊపి ప్రారంభించేసారు. తాడేపల్లి గూడెంలో డబల్ డెక్కర్ రైలు ను ప్రారంభోత్సవం లో

ఎంపీ తో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ రైలు గత నెల ప్రారంభం కావాల్సి యుంది. అనివార్య కారణాల వల్ల వాయిదా

పడింది. à°°à±†à°‚డో సారి ఖరారు చేసిన ముహూర్తానికి రైలు పట్టాలెక్కింది. రెండు సార్లు ముహూర్తం పెట్టిన à°ˆ రైలు కు జండా కూడా రెండుసార్లు ఊగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam