DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదుల బైక్ ర్యాలీ. . .

1956 లోనే హైకోర్టు విశాఖ రావాల్సి యుంది. . .

అన్ని వేళలా విశాఖ ను మోసం చేశారు : పృథ్విరాజ్

హెల్మెట్ లు లేని బైక్ ర్యాలీ కి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు

?

లోకేష్ ర్యాలీ కి ఓ రూలు, లాయర్ల ర్యాలీ కి మరో రూలా ?

(DNS రిపోర్ట్ : సత్య గణేష్ BVS , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం). . . .

విశాఖపట్నం, 27 సెప్టెంబర్, 2019 ( DNS ) : ఆంధ్ర

రాష్ట్ర ఏర్పాటు (1956 ) సమయంలోనే హైకోర్టు విసకః రావాల్సియుందని అప్పడి నాయకుల మోసం కారణంగా హైకోర్టు హైద్రాబాద్ కు తరలి పోయిందని సీనియర్ న్యాయవాది జె. పృథ్విరాజ్

మండిపడ్డారు. రాష్ట్ర హైకోర్టు విశాఖ లోనే ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్ తో గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలోని న్యాయవాదులు ధర్నాలు, నిరసనలు

తెలియచేస్తున్నారు. దానిలో భాగంగా గురువారం విశాఖ జిల్లా న్యాయస్థానం నుంచి వందలాదిగా న్యాయ వాదులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

విశాఖ లో హైకోర్టు ఉండాలి,

హైద్రాబాద్ లో క్యాపిటల్ ఉండాలి అని నిర్ణయం జరిగింది. కేవలం ఒక్క ఓటు తో విశాఖ నుంచి హైకోర్టు హైద్రాబాద్ కు తరలి పోయిందని తెలిపారు. 1992 లో ఆరు నెలల పాటు

న్యాయవాదులు మొత్తం అన్ని కార్యాచరణాలు బహిష్కరించి నిరసనలు చేయడం జరిగిందన్నారు. నాటి ముఖ్యమంత్రి స్వార్ధ పూర్తిగా రాజకీయ కారణంగా విశాఖ లో హైకోర్టు

పెట్టాలి అనే డిమాండ్ ను తుంగలోకి తొక్కారన్నారు.

మూడు రోజుల పాటు నిరసనలు :

విశాఖ కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు చెయ్యాలి అనే ఏడు దశాబ్దాల డిమాండ్ ను

నెరవేర్చుకోడం కోసం ఉత్తరాంధ్ర న్యాయవాదులు మూడు రోజుల పాటు నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా గురు వారం కోర్టు నుంచి స్థానిక జగదాంబ జంక్షన్ వరకూ భారీ ర్యాలీ

చేపట్టి, అనంతరం కూడలి వద్ద మానవ హారం చేపట్టారు.

నేడు శుక్ర వారం 200 మంది న్యాయవాదులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ఆర్టీసీ కాంప్లెక్

వరకూ ఈ ర్యాలీ సాగింది. యువ న్యాయవాదుల నుంచి సీనియర్ల వరకూ అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయనకు వినతి పత్రం అందించారు.
/> శనివారం ఉత్తరాంధ్ర న్యాయవాదులందరితోనూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి సారధ్యంలో సమావేశం జరుగనుంది. తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నారు.

లోకేష్

కి ఇవ్వని అనుమతి లాయర్ల కి ఎలా?

శుక్రవారం విశాఖ న్యాయవాదులు చేపట్టిన బైక్ రాలి లో న్యాయవాదులు హెల్మెట్ లు ధరించకుండానే బైకు లు నడపడం వివాదాస్పదం గా

మారింది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ మొత్తం ఫైన్ లు వడ్డించే పోలీసులకు న్యాయవాదులు నిర్వహించిన బైక్ ర్యాలీ కనపడలేదా ని ప్రశ్నిస్తున్నారు.

à°—à°¤

నెలలో మాజీ మంత్రి నారా లోకేష్ విశాఖ లో నిర్వహించిన బైక్ ర్యాలీ లో హెల్మెట్ లు ధరించని కారణంగా పోలీసులు ర్యాలీ ని నిషేధించారు. మరి శుక్రవారం న్యాయవాదులు

నిర్వహించిన ర్యాలీ వీళ్ళకి కనడక పోవడం గమనార్హం. పైగా ఈ ర్యాలీకి బందోబస్త్ చూడడం కూడా విశేషం. ఇంతమంది లాయర్ల పై ఫైన్లు, కేసులు పెడితే వ్యవహారం వేరేగా

ఉంటుందని పోలీసులు వెనక్కి తగ్గారా అనే అనుమానాలు కూడా సామాన్యుల్లో ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam