DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కచ్ఛులురు బోటు మునక: అధికారుల నిర్లక్షానికి నిదర్శనం    

ఆపన్నులకు రూ.10 లక్షల ప్రోత్సాహం అందించాలి

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు అందించాలి

బోటు ప్రమాదంపై ఆనంరోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపటంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో

జరిగిన  à°¬à±‹à°Ÿà± ప్రమాదానికి ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని, తక్షణమే బోటును వెలికితీసి మృతుల సంఖ్యను నిర్ధారించాలని రాజమహేంద్రవరం అఖిలపక్ష

నాయకులు డిమాండ్ చేశారు. అవకతవకలను కప్పిపుచ్చుకోకుండా ముందుకు వచ్చిన నిపుణులతో అందరి సమక్షంలో బోటు వెలికితీయాలని, అక్కడ 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్

చేశారు.నగర తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి అధ్వర్యంలో వై జంక్షన్ లోని ఆనం రోటరీ హాల్లో బోటు ప్రమాదం,వెలికితీత అంశాలపై వివిధ రాజకీయ

ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ

పార్లమెంట్ సభ్యులు జి.వి.హర్షకుమార్, శాప్ మాజీ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు

ఎన్.వి.శ్రీనివాస్, సిపిఎం నాయకులు ఎస్.ఎస్.మూర్తి,సిపిఐ నాయకురాలు యడ్ల లక్ష్మీ హాజరయ్యారు.ముందుగా బోటు ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ రెండు

నిమిషాలు మౌనం పాటించారు. ప్రాముఖ్యమైన అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి మణిని నాయకులు అభినందించారు. బాధితులకు న్యాయం జరగాలని భావించి ఈ

సమావేశాన్ని ఏర్పాటు చేశానని మణి తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam