DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు: ఎమ్మెల్సీ మాధవ్ 

విశాఖపట్నం, జూన్ 2  : ధర్మ పోరాటం, మహానాడు, నవనిర్మాణ దీక్ష  à°ªà±‡à°°à±‡à°¦à±ˆà°¨à°¾ ప్రాంతమేదైనా చంద్రబాబు కు వఛ్చిన మాట, పాట ఒక్కటేనని, అది ప్రధాని మోడీని విమర్శించడం,

బీజేపీని తిట్టడం తప్ప ఇంకేమి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ మండిపడ్డారు. శనివారం నగరం లోని బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ   చంద్రబాబు నిరాశావాద దృక్పథంతో బీజేపీని తిడుతూ ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆశావాద దృక్పథంతో అభివృద్ధి చెందుతూ ముందుకు

పోతోందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు అడగడమే బీజేపీ చేసిన తప్పుగా తెలుగుదేశం భావించిందన్నారు. అందుకే ఎన్డీఏ నుంచి విడిపోయి ఇప్పుడు

విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకుందన్నారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు, వెన్నుపోట పదాలకు నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు నాయుడని అన్నారు. 

ఎన్నికల్లో

తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పేదలకు ఇల్లు, దళితులకు భూమి ఇవ్వకపోవడం, కాపు రిజర్వేషన్ వంటి హామీల్లో ఒక్కటి కూడా

నెరవేర్చకపోవడం చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలి అని పిలుపునిచ్చారు.
బెల్టు షాపుల రద్దు, ప్రజా వ్యతిరేక జన్మభూమి కమిటీలు, ఇంటికో ఉద్యోగం, BC లు,

కాపుల మధ్య గొడవలు పెట్టడం, అన్న కాంటీన్, NTR సృజల స్రవంతి ఏర్పాటు చేయకపోవడం మీ చేతగానితనానికి నిదర్శనం కాదా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునేది

బీజేపీనే తప్ప టీడీపీ కాదు అని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం కొరకు SPU ఏర్పాటు చేయకపోవడమే కాకుండా తిరిగి బీజేపీని నిందించడం సరికాదు. ఈ కార్యక్రమంలో నగర

ప్రధాన కార్యదర్శి కేశవకాంత్ గారు,  à°¨à°—à°° ఉపాధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి గారు, సుహాసిని ఆనంద్ గారు పాల్గొన్నారు.


 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam