DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లైసెన్సుడు సర్వేయర్లకు జీవనోపాధి కల్పించండి.

(DNS రిపోర్ట్ : రాము,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): శిక్షణ పొంది, లైసెన్సు కలిగిన సర్వేయర్లకు గ్రామ సర్వేయర్ పోస్టు ద్వారా జీవనాధారం

కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  à°†à°‚ధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్ డు  à°¸à°°à±à°µà±‡à°¯à°°à±à°¸à± అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం

నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. à°ˆ నిరసనలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు  à°¸à°‚తోష్ నాగ అప్పారావు, నేతలు  à°†à°°à±. ఉమామహేశ్వర రావు, జగన్ మోహన రావు, అప్పారావులు

మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరిస్తానని జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలను  à°…నుసరించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వీధినపడ్డ తమ కుటుంబాలను సీఎం జగన్ తక్షణమే

స్పందించి ఆదుకోవాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తాము పటిష్టమైన సర్వే శిక్షణ పొంది ఉన్నామన్నారు. థియరీ, ప్లాంటింగ్, ప్రాక్టికల్ పరీక్షలు 70 శాతం

 à°‰à°¤à±à°¤à±€à°°à±à°£à°¤ సాధించి స్వయం ఉపాధి కొరకు రెవెన్యూశాఖలో లైసెన్సు డు సర్వేయర్లుగా జీవనం సాగిస్తున్నామన్నారు. కానీ ప్రస్తుతం తమ జీవనం అగమ్యగోచరంగా

మారిందన్నారు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కేటాయించి తమకు అత్యాధునికమైన సర్వే శిక్షణలు అందించారన్నారు. కానీ ప్రస్తుతం తమకు ఉద్యోగ భద్రత లేని

కారణంగా ఆ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక సర్వేయర్ ను నియమించడం వలన తమకు పని లేక ఉపాధి

కోల్పోయి కుటుంబాలతో సహా వీధిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించి మానవతా దృక్పథంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రామ సచివాలయ

బ్యాక్లాగ్ పోస్టుల్లో స్పెషల్ రిజర్వేషన్లు కల్పించి తమను నియమించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో లైసెన్సు డు సర్వేయర్లు

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam